– విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే అనిల్ఎ దురుదాడి
– కాకాణి తప్పు చేయకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు కదా !
– జగన్ తాత రాజారెడ్డి కి మైన్స్ అమ్మిన చరిత్ర విపిఆర్ కుటుంబానిది.
– మైనింగ్ కి డిమాండ్ పడిపోవడానికి, కొనడానికి చైనా ముందుకు రాకపోవడానికి కాకాణి, అనిల్ ఇద్దరే కారణం.
– గౌడన్ల నిండా జిలెటిన్ స్టిక్స్ నిల్వ చేసిన ఘనత కాకాణి గోవర్థన్ రెడ్డి ది
– సోమిరెడ్డి పైకి హిజ్రాలను పంపిన నీచ చరిత్ర కాకాణి గోవర్థన్ రెడ్డి ది
– శాసనమండలి సభ్యులు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయం నందు ఎమ్మెల్సీ ,పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో బీద మాట్లాడుతూ, కాకాణి పై పెట్టిన అక్రమ కేసులకు, కూటమి వేధింపులకు భయపడం, వెనుకడుగు వేయమని నిన్నటి రోజున మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఆయన లోని అభద్రతాభావం ను స్పష్టం చేస్తున్నాయి.
కాకాణి పై కేసులు పెట్టింది ఎవరు అనిల్ ? కాకాణి అక్రమ మైనింగ్ పై నాటి వైసీపీ ప్రభుత్వం, జిల్లా అధికారులు చోద్యం చూస్తూ చేతులు ముడుచుకుంటే సోమిరెడ్డి ఫిర్యాదు తో జోక్యం చేసుకున్నది కేంద్ర మైనింగ్ శాఖ కాదా?
నాటి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీల నుండి కేంద్ర మైనింగ్ శాఖ వారు సమాచారం తెప్పించుకుని కాకాణి అక్రమ మైనింగ్ చేస్తున్నారని నిర్థారించుకున్న మాట వాస్తవం కాదా? వైసీపీ ప్రభుత్వం లో ఏనాడైనా మైనింగ్ వ్యాపారులు కోర్టు కు వెళ్ళారా అని ప్రశ్నించిన అనిల్…..మీ ప్రభుత్వం లో జరిగిన దౌర్జన్యం గురించి మేము చెప్పాలా? గజగజా వణకడం తప్ప కోర్టు మెట్లు ఎక్కే ధైర్యం ఉందా నాడు వ్యాపారులకు ?
“నా మైన్ లోకి చొరబడి అక్రమంగా మైనింగ్ తవ్వుకుంటున్నారని, అమ్ముకుంటున్నార”ని రుస్తుం మైన్స్ వారు కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెస్తే నాటి ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, ఎస్పీ పట్టించుకున్నారా ? తోడేరు లోని 5 ప్రాంతాలలో మాజీ మంత్రి కాకాణి అక్రమంగా మైనింగ్ ను త్రవ్వి, తన మైన్స్ లో తెచ్చిపోసి, వారిది నాది అంతా కలిపి అమ్ముకుంటున్నారని రుస్తుం యాజమాన్యం గగ్గోలు పెడితే సీఎం, చీఫ్ సెక్రటరీ, డీజీపీ కార్యాలయాలు నాడు స్పందించాయా?
అక్రమ మైనింగ్ చేసున్న చిత్రాలు, 14 ప్రొక్లయిన్లు, 30 డంపర్ లు, గౌడన్ల నిండా ఉన్న జిలెటిన్ స్టిక్స్ ను వీడియోలు తీసి కేంద్ర మైనింగ్ సెక్రటరీ కి పంపితే తప్ప నాడు అక్రమ మైనింగ్ ఆగలేదు. 5 ఏళ్ల పాటు సోమిరెడ్డి మొదలుకొని క్రింది స్థాయి కార్యకర్త వరకు అక్రమ కేసులతో వేధించడమే కాక అక్రమ మైనింగ్, ఆరాచకాలు, దౌర్జన్యాలు చేసిన కాకాణి పై కేసులు పెట్టక జై కొట్టాలా అనిల్ ?
విపిఆర్ తండ్రి వేమిరెడ్డి కోటారెడ్డి 50 ఏళ్ల క్రితం నుండే మైనింగ్ వ్యాపారం లో ఉన్నారు. బత్తనపల్లి,అమ్మవారి పాలెం, బాల దుర్గ గని, బాటా గని, జానకి రామ్ తదితర మైన్ లు నిర్వహించారు. ఆఫ్రికా, ఇండోనేషియా తో సహా ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ వ్యాపారం చేసిన చరిత్ర విపిఆర్ కుటుంబానిది. జగన్ తాత రాజారెడ్డి కి మైన్స్ అమ్మిన కుటుంబం విపిఆర్ ది.
లక్ష్మి క్వాడ్జ్ కంపెనీ విపిఆర్ దేనని, ఆ విషయం తాను బయట పెట్టానని అనిల్ గొప్ప గా చెబుతున్నారు. విపిఆర్ కంపెనీ పెడితే తప్పేముంది అనిల్ ? స్థానికంగా దొరికే వనరులఆధారంగా చట్టపరమైన అనుమతులతో కంపెనీ పెట్టడం నేరమేమి కాదే! కేంద్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపన ను ప్రోత్సహిస్తోంది. సెమీ కండక్టర్స్, సోలార్ ప్యానెల్స్, ట్యూబ్స్ అవసరం అవుతున్నాయి. ఒక్క మన రాష్ట్రం లోనే వేల మెగా వాట్ల సోలార్ ప్రాజెక్టులు వస్తున్నాయి.
కేంద్ర ప్రోత్సాహం తీసుకుని, ఇక్కడ దొరికే వనరులను ఉపయోగించుకుని, కోట్లాది రూపాయల పెట్టుబడులు వెచ్చించి పరిశ్రమ స్థాపన కు పూనుకుంటే తొలి దశలోనే కుట్ర పూరితంగా అడ్డుకోవడం, అర్థ రహిత విమర్శలు చేయడం అనిల్ కే చెల్లింది. అక్రమ మైనింగ్ పేరిట చైనా లో చెత్త చెదారం డంప్ చేసి, ఏపీ లో మైనింగ్ వ్యాపారాన్ని గందరగోళం కు గురి చేసిన కాకాణి, అనిల్ లు కూటమి ప్రభుత్వం పై విపిఆర్ పై విమర్శలు చేయడం సరికాదు.
సమావేశంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి,సీనియర్ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి , తాళ్ళపాక అనురాధ ,కొండూరు పాలిశెట్టి ,మల్లిశెట్టి వెంకటేశ్వర్లు,పనబాక భూ లక్ష్మి, అమృల్లా,నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.