Suryaa.co.in

Andhra Pradesh

కిశోరి వికాసం ద్వారా బాలికల సర్వతో ముఖాభివృద్ధికి చర్యలు

– బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత

పెనుకొండ : కిశోరి వికాసం ద్వారా బాలికల సర్వతో ముఖాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత అన్నారు.పెనుకొండ పట్టణంలోని ICDS కార్యాలయం నందు గర్భిణీలకు పౌష్టికాహారం, చిన్నారులు కు అన్నప్రాసన చేసిన మంత్రి సవిత మాట్లాడుతూ బాలికలకు ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ‘కిశోరి వికాసం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందని తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా విద్య, ఆరోగ్యం, నైపుణ్యం, ఎదుగుదల, పోటీతత్వం, వ్యక్తిగత శుభ్రత వంటి అంశాలపై బాలికలకు అవగాహన కల్పించనున్నారని మంత్రి తెలిపారు.. బాల్య వివాహాలు జరగకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఆడపిల్లలు స్కూల్ డ్రాప్ అవుట్ లు కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.ఈ కార్యక్రమంలో DSP MRO ,మున్సిపల్ కమిషనర్ ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు,వెలుగు సభ్యులు, వెల్ఫేర్ సిబ్బంది మరియు మహిళా పోలీసులు,కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE