– కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం
– కార్యకర్తల సంక్షేమం, భద్రతే తెలుగుదేశం పార్టీ ధ్యేయం
– వైసీపీ చీప్ పాలిటిక్స్ ను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం
– మంత్రి సవిత
రొద్దం : దేశంలో కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీనేనని మంత్రి సవిత తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం M కొత్తపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు P ఈరన్న, సంజీవప్ప ఇద్దరు గత రెండు నెలల క్రితం బైక్ ప్రమాదంలో చనిపోయారు .వారు ఇద్దరు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా రాగా, వారింటికి వెళ్లి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందచేసిన మంత్రి సవిత ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులని పరామర్శించి అధైర్య పడకండి తెలుగుదేశం పార్టీ ,మేము మీకు అండగా ఉంటామని పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమం, భద్రతే తెలుగుదేశం పార్టీ ధ్యేయంమని తెలిపారు.టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చొరవతో రూ.5 లక్షల ప్రమాద బీమా మంజూరు అయ్యాయని తెలిపారు.
వైసిపి పార్టీ ఉనికి కోసమే చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని మంత్రి తెలిపారు. వైసిపి పార్టీకి 11 సీట్లు వచ్చిన ఇంకా బుద్ధి రాలేదన్నారు.అమరావతి సభ విజయవంతమైనందుకు ప్రజలు సంతోషించారు .గత పాలకులు అమరావతిని భ్రమరావతి అని ఎద్దేవ చేశారు. ప్రధాన మంత్రే
ముఖ్యమంత్రి చంద్రబాబు ను చూసి స్ఫూర్తి పొందానని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ అనటం ముఖ్యమంత్రి గొప్ప పనితనానికి నిదర్శనమన్నారు. దేశాన్ని గాడిలో పెట్టిన ఏకైక ప్రధాని మోదీ అని అన్నారు.