Suryaa.co.in

Andhra Pradesh

నందమూరి బాలకృష్ణకు ఎం.ఎస్.రాజు అభినందన

– హిందూపురంలో మర్యాదపూర్వక భేటీ

హిందూపురం : పద్మభూషణ్, నందమూరి నటసింహం, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణను మడకశిర నియోజకవర్గ శాసనసభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు ఎం.ఎస్.రాజు ప్రత్యేకంగా అభినందించారు. హిందూపురం నియోజకవర్గ పర్యటనలో ఉన్న బాలకృష్ణను ఎం.ఎస్.రాజు సోమవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇటీవల ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతులు మీదుగా పద్మభూషణ్ అవార్డు తీసుకున్న సందర్భంగా హిందూపురంలో నేడు కలిసి, బుద్ధుడి విగ్రహాన్ని బహుకరించి అభినందనలు తెలిపారు. తనను కలిసేందుకు వచ్చిన ఎం.ఎస్.రాజును బాలకృష్ణ అప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నిన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న విషయాన్ని తెలుసుకుని ఎం.ఎస్.రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

బాలకృష్ణను కలిసిన సందర్భంలో అక్కడ ఉన్న రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ని కూడా ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడున్న పార్టీ పెద్దలు, నాయకులతో కాసేపు ముచ్చటించారు.

LEAVE A RESPONSE