Suryaa.co.in

Andhra Pradesh

ఐదేళ్ల విధ్వంసానికి ముగింపు పలుకుదాం

-అరాచకం కావాలా…అభివృద్ధి కావాలా?
-సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే కూటమి అజెండా
-సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ

ఐదేళ్ల ప్రభుత్వంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారా యణ అన్నారు. సత్తెనపల్లి పట్టణం 31వ వార్డులో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా కార్యసిద్ధి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచారంలో బాణసంచా, తప్పెట్లతో ఘన స్వాగతం పలికారు. ప్రతి వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి వివరించారు. అన్ని వర్గాలను మోసం చేసిన జగన్‌ సామాజిక ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఏ ఊరికి వెళ్లినా వైసీపీ పాలనలో ఐదేళ్ల విధ్వంసం కనిపిస్తుంది. జగన్‌ నోటి నుంచి వచ్చే అసత్యాలు, బూటకపు ప్రసంగాలని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సబ్‌ప్లాన్‌ నిధులు లక్షల కోట్లు రూపాయలు దారి మళ్లించారు. తెలుగుదేశం పార్టీ తెచ్చిన 120 సంక్షేమ పథకాలను జగన్‌ రెడ్డి రద్దు చేశారు. సామాజిక న్యాయం అనే పదం పలికే అర్హత జగన్‌ రెడ్డికి లేదన్నారు. రాష్ట్రంలో ఏ మూల చూసినా అభివృద్ధి లేదు. 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్సే. జగన్‌కు రాజకీయంగా చివరి ఛాన్స్‌ అన్నారు. ఎవరిది అభివృద్ధి పాలనో, ఎవరిది విధ్వంస పాలనో ప్రజలకు తెలుసు. కూటమి మేనిఫెస్టోను గడపగడపకు తీసుకువెళ్లి మన ప్రభుత్వం వస్తే ఏమి అభివృద్ధి చేస్తామో వివరించాలని సూచించారు.

LEAVE A RESPONSE