Suryaa.co.in

Andhra Pradesh

పెదకాకాని విద్యుదాఘాతం ఘటన పై మంత్రి గొట్టిపాటి దిగ్భ్రాంతి

అమరావతి: గుంటూరు జిల్లా పెదకాకాని విద్యుదాఘాతం ఘటన పై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన నలుగురు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాద ఘటన పై స్థానిక శాసన సభ్యులు ధూళిపాళ్ల నరేంద్రతో పాటు స్థానిక అధికారులతో కూడా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు.

ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవి హామీ ఇచ్చారు. కరెంట్ కు సంబంధించిన పనులు చేసేటప్పుడు ప్రజలు జాగ్రత్త వహించాలి మంత్రి విజ్ఞప్తి చేశారు. ముందస్తుగా స్థానికంగా ఉండే విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అధికారులకు సరైన సమయంలో సమాచారం అందించడం కారణంగా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.

LEAVE A RESPONSE