వీధి రౌడీల్లా అశోక్ గజపతిరాజుపై మంత్రులు దాడికి తెగించారు

– రామతీర్థం రాముని సాక్షిగా వైసీపీ అరాచకం బట్టబయలైంది
– టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు

దేవాలయాల్లో పాటించాల్సిన ఆనవాయితీని ప్రశ్నిస్తే దాడులు చేసే సంస్కృతికి వైసీపీ ప్రభుత్వం దిగజారింది. రామతీర్థం ఆలయ కమిటీ ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజు పేరు లేకుండా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు? వేల ఎకరాలను దానం చేసిన కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా.?

కనీసం ప్రోటోకాల్ నిర్వహించాలన్న బుద్ధి ఈ ప్రభుత్వ పెద్దలకు లేదా.? ప్రోటోకాల్ పై నిలదీసిన అశోక్ గజపతిరాజుపై మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ దాడికి తెగించడం దుర్మార్గం. మంత్రులు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆలయ పెద్దలకు మర్యాదలు ఇవ్వాలన్న ఇంగితజ్ఞానం మంత్రులకు లేదా.? కక్ష సాధింపులతో సాంపద్రాయాలకు ఈ ప్రభుత్వం శఠగోపం పెడతోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుండి అశోక్ గజపతిరాజుపై కక్షగట్టారు. మాన్సాన్ ట్రస్టు చైర్మన్ గా తొలగించి భూములు దోచుకోవాలని చూశారు. రామతీర్థం దేవాలయ నిర్మాణానికి అశోక్ గజపతిరాజు విరాళం ఇస్తే ఎందుకు తీసుకోలేదు. దేవుడికి చేసే పూజలను కూడా జగన్ కు చేసే భజనలా ఊహించుకుంటున్నారు. భక్తితో ఇచ్చిన వాటిని నిరాకరించే హక్కు మీకు ఎవరిచ్చారు.?

సాంప్రదాయాలను కాలరాస్తే దైవాగ్రహానికి గురవ్వక తప్పదు. రోడ్డు మీద వీరంగం సృష్టించినట్లు దేవుని గర్భ గుడిలోనూ వీరంగం సృస్టిస్తున్నారు. రామతీర్థంలో రాముడి తల తొలగించి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేదు. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ఎలా నిందలు వేయాలనిపిస్తోంది.? బూతుల మంత్రితో పోటీపడి కొబ్బరిచిప్పల మంత్రి చిన్నాపెద్ద లేకుండా నోరుపారేసుకుంటున్నారు. దేవాలయాలపై దాడులు చేసిన వారిని రెండేళ్లుగా కాపాడుతున్నారు. ఒక్క నిందితుడినైనా ప్రజల ముందు నిలబెట్టారా.? మీ అరాచక, దుర్మార్గాలు ఎల్లకాలం సాగవు.

Leave a Reply