Suryaa.co.in

Telangana

మోడీది నియంతృత్వ పోకడ

-ఇండియా కూటమితోనే దేశ సర్వతోముఖాభివృద్ధి
-దేశ ప్రజలు సొంత సమస్యల పరిష్కారం పై ఆసక్తిగా ఉన్నారు, మార్పును కోరుకుంటున్నారు
-పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మూడవరోజు ప్రచారం

ఫరీద్ కోట్ : ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సుస్థిర ఆర్థిక విధానాలతో దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యమిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ఆయన ఫరీద్ కోట్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో మీడియాతో మాట్లాడారు. అనంతరం పలు సమావేశాల్లో ప్రసంగించారు. వరుసగా మూడవ రోజు డిప్యూటీ సీఎం ఫరీద్ కోట్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ముకాం వేసి ప్రచార నిర్వహిస్తున్నారు. మరోవైపు పార్టీ నేతలను సమన్వయం చేస్తూ సభలు నిర్వహిస్తున్నారు. స్థానిక ఓట్లతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకుంటున్నారు.

మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా అనుసరించిన పక్షపాత వైఖరి, వేధింపుల మూలంగానే మన దేశం నుంచి అనేక ప్రైవేటు పెట్టుబడులు తరలిపోయాయని అన్నారు. కరెన్సీ నోట్ల రద్దు, జీఎస్టీ భారం, ఆకస్మిక లాక్ డౌన్ దేశంలోని కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరించడం వంటి మోడీ ప్రభుత్వ తప్పిదాల మూలంగా దేశ ఆర్థిక అభివృద్ధి దెబ్బతిందని పేర్కొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆర్థిక రంగం అభివృద్ధితో పాటు పెట్టుబడులు భారీగా తరలివచ్చాయని వివరించారు.

మోడీ ప్రభుత్వం తీరుతో పారిశ్రామికవేత్తల్లో పెట్టుబడుదారులు ఏర్పడిన అపనమ్మకాన్ని ఇండియాకూటమి ప్రభుత్వం తొలగిస్తుందని చట్టబద్ధమైన పాలనతో అందరి విశ్వాసాన్ని పొందుతుందని తెలిపారు. ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే దేశ ఆర్థిక రంగం ఒడిదుడుకులకు గురవుతుందని స్టాక్ మార్కెట్లు పతనమవుతాయంటూ బిజెపి నేతలు పెట్టుబడిదారుల్లో భయాందోళనలు రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు దేశ ప్రజలు ఆసక్తిగా ఉన్నారు, మార్పును కోరుకుంటున్నారని వివరించారు. విద్వేష రాజకీయాలతో దేశం విసిగిపోయింది, ఇప్పుడు సొంత సమస్యల పరిష్కారానికి ఓటర్లు మానసికంగా సిద్ధమయ్యారని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం రైతులు కనీస మద్దతు ధర కోసం రుణ మాఫీ కోసం మహిళలు ఆర్థిక స్వాతంత్రం భద్రత కోసం కార్మికులు వేతనాల రక్షణ కోసం ఓట్లు వేస్తున్నట్టు స్పష్టమైందన్నారు. ప్రజల మధ్యన శత్రుత్వాన్ని రాష్ట్రాల మధ్యన విద్వేషాలను పెంచేలా ప్రధాని మోడీ ప్రసంగాలు ఉన్నాయని ఆక్షేపించారు.

మోడీ అన్నీ తానై మొత్తం దేశాన్ని నడపాలని అనుకోవడం నియంతృత్వ పోకడలకు నిదర్శనం అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి రప్పించడం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం వంటి హామీలను బిజెపి నెరవేర్చలేకపోయిందన్నారు. రిజర్వేషన్లు, రాజ్యాంగం అనే రెండు ప్రధాన అంశాలు కేంద్రంగా ఎన్నికలు జరుగుతున్నాయి. రాజ్యాంగాన్ని బిజెపి మార్చాలనుకుంటుంది, ప్రజాస్వామ్యాన్ని అణిచివేయాలని చూస్తోంది అందుకే ఈ ఎన్నికలు దేశానికి చాలా ముఖ్యమైన అని వివరించారు.

LEAVE A RESPONSE