– వర్సిటీ గుర్తింపుని రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు
– ఫీజుల రూపేణా రూ.26 కోట్లు అదనంగా వసూలు
– ఉన్నత విద్యా కమిషన్ షాక్
తిరుపతి: నటుడు మోహన్బాబుకు ఉన్నత విద్యా కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. మోహన్ బాబు యూనివర్సిటీకి రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ భారీ జరిమానా విధించింది. యూనివర్సిటీ గుర్తింపుని రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
గత మూడేళ్ల నుంచి విద్యార్థుల నుంచి ఫీజుల రూపేణా రూ.26 కోట్లు అదనంగా వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఉన్నత విద్యా కమిషన్ మోహన్ బాబు యూనివర్సిటీపై విచారణ జరిపింది. విచారణ జరిపి నిజమేనని నిర్ధారించింది.
యూనివర్సిటీకి రూ.15 లక్షల జరిమానా విధించింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26 కోట్ల రూపాయలను 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. రూ.15 లక్షల జరిమానాను యూనివర్సిటీ ఇప్పటికే చెల్లించింది.