– వ్యవసాయ యోగ్యమైన భూములు అన్నింటికీ రైతు భరోసా
– సన్న ధాన్యానికి క్వింటాకు 500 రూపాయలు చొప్పున బోనస్
– 200% కాస్మోటిక్ ఛార్జీలు పెంచాం
– విద్యుత్ శాఖ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న డి.ఏ విడుదల చేస్తూ వేదిక నుంచి ఉత్తర్వులు జారీ చేసిన డిప్యూటీ సీఎం
– రాష్ట్ర సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ లో 92 మంది అభ్యర్థులకు జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ గా, తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థలో 20 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన కార్యక్రమంలో మాట్లాడిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్: అబద్ధాల మీద పుట్టిన రాజకీయ పార్టీ గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ప్రజలకు భ్రమలు కల్పించి బతికిండ్రు. ఇప్పుడు మళ్లీ అవే అబద్దాలతో ప్రజా ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తుండ్రు.
గత ప్రభుత్వం అప్పులు చేసి ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చే స్థితిలోకి నెట్టివేస్తే…. ఒకటవ తేదీన జీతాలు ఇచ్చే స్థితికి ఈ రాష్ట్రాన్ని ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చింది.
నిరుద్యోగుల ఆశలను అడియాసలు చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా గాలికి వదిలేస్తే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏడాది లోపు 56 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం.
పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడానికి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ ని గత బిఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేయగా, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ 5 లక్షల రూపాయల నుంచి పది లక్షలకు పెంచి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలో భాగంగా అధికారంలోకి రాగానే రాష్ట్ర మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం.
ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతుందో లేదో తెలుసుకోవడానికి మీ మహిళలను ఎక్కించండి. టికెట్ అడిగితే మమ్మల్ని అడగండి. లేకుంటే మీరు బస్సు ఎక్కి చూడండి కాంగ్రెస్ అమలు చేసిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కనిపిస్తుంది. 2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీ కొరకు 22 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసిన చరిత్ర ప్రజా ప్రభుత్వానిది.
ఎన్నికల ముందు రైతు బంధు డబ్బులు ఇవ్వకుండా గత పాలకులు ఎగ్గొడితే, అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఒకే రోజు 7624 కోట్ల రూపాయలను జమ చేసింది. వ్యవసాయ యోగ్యమైన భూములు అన్నింటికీ రైతు భరోసా ఇస్తున్నాం. 8400 కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం వెచ్చించడానికి ప్రాథమిక అంచనా వేసి ఈనెల 26 నుంచి రైతుల ఖాతాల్లో ఈ డబ్బులను జమ చేయబోతున్నాం.
భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఈనెల 26 తర్వాత మొదటి విడత ఇన్స్టాల్మెంట్ డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాం. రైతులు పండించిన సన్న ధాన్యానికి క్వింటాకు 500 రూపాయలు చొప్పున బోనస్ ఇస్తున్నాం.
పది సంవత్సరాల్లో డైట్ చార్జీలు పెంచకుండా గాలికి వదిలేస్తే.., విద్యార్థుల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుగా ఆలోచించి 40 శాతం డైట్ చార్జీలు పెంచడంతో పాటు 200% కాస్మోటిక్ ఛార్జీలు పెంచాం. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
ఈ రాష్ట్రానికి లక్ష కోట్లు పెట్టుబడులు తీసుకురావడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్ వెళ్లారు. గత పర్యటనలు దావోస్ వెళ్లి 46 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తెచ్చారు. విలాసాలకు అనవసర ఖర్చులకు ప్రజాధనాన్ని ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టం. సంపద సృష్టించి, సృష్టించిన సంపదను ప్రతి ఒక్కరికి పంచడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం.
విద్యుత్ శాఖ ముందు ఉన్న సవాళ్ళను అధిగమించి నిరంతరం నాణ్యత విద్యుత్తును సరఫరా చేస్తున్నాం. త మార్చి 8న 15,623 మెగావాట్ల డిమాండ్ ను తట్టుకొని విద్యుత్ సరఫరా చేసిన శక్తి తెలంగాణ విద్యుత్ శాఖకు ఉందని చాటి చెప్పాం. హైదరాబాద్ నగర అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ ఏర్పాటు, కొత్తగా రానున్న పరిశ్రమల ఏర్పాటుకు పెరుగనున్న విద్యుత్ డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని, 2029 30 నాటికి 22,448 మెగావాట్లు, 2034 -35 నాటికి 31,809 మెగావాట్ల డిమాండ్ విద్యుత్ సరఫరా చేయడానికి కసరత్తు చేపట్టాము.
గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీని తీసుకురాకుండా గాలికి వదిలేసింది. న్యూ ఎనర్జీ పాలసీని తీసుకువచ్చి 2035 సంవత్సరం నాటికి రాష్ట్రంలో 40 వేల మెగావాట్ల క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతున్నది. రాష్ట్రంలో 28 లక్షల వ్యవసాయ పంప్ సెట్లకు ఉచితంగా విద్యుత్తును అందజేస్తున్నాం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 2004లో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రజా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్నది.
వ్యవసాయ పంపుసెట్ల ద్వారా రైతులకు అందిస్తున్న ఉచిత కరెంటుకు సంబంధించి 8729 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి రైతుల పక్షాన డిస్కములకు చెల్లిస్తున్నది. గత మార్చి ఒకటి నుంచి అమలు చేస్తున్న గృహ జ్యోతి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల 148.5 కోట్లు, ఇప్పటివరకు విద్యుత్ శాఖకు 1485 కోట్ల రూపాయలను చెల్లించింది.
రాష్ట్రంలో 25 గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సోలార్ గ్రామాలుగా మార్చబోతున్నాం. వ్యవసాయ పంపు సెట్లకు, గృహాలకు రూప్ టాప్ సోలార్ ఏర్పాటు చేయబోతున్నాం.