ఈనెల 9 నుంచి ఉద్యమ కార్యాచరణ

– ఒకటో తేదీన ఇవ్వాల్సిన జీతాలు, పెన్షన్లు ఎప్పుడిస్తారో తెలియదు
– ఇస్తున్న టీఏ లు వెనక్కు తీసుకోవటం దుర్మార్గం
– ఉద్యోగులు అప్పులు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు
– న్యాయబద్ధమైన రాయితీలు ఇస్తామని లిఖిత పూర్వక హామీ ఇస్తేనే ఉద్యమం ఆపుతాం
– ఏపీజేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు

కార్యక్రమ విజయవంతం కోసం రాష్ట్రం మొత్తం పర్యటిస్తున్నాం.ఉద్యమంపై మంత్రి బొత్స, సజ్జల ఉద్యోగ సంఘ నేతలతో చర్చించారు. ఇప్పటికే ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సమయం కన్నా ఎక్కువే ఇచ్చామని వారికి తెలియజేశాం.కరోనాను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి ఉద్యోగులు పూర్తి సహకారాన్ని ఇచ్చాయి.

పీఆర్సీ రాయితీలను తగ్గించి ఇవ్వడంపై రోడ్డు మీదకు వచ్చాం.మాకు బ్రతకలేని పరిస్థితి తీసుకువచ్చారు కాబట్టే ఉద్యమబాట.ఉద్యోగుల రావాల్సిన బకాయిలు మాకు రిటైర్మెంట్ తర్వాత ఇస్తామని జీవో ఇచ్చారు.మాకు రావాల్సిన డబ్బులు రావు. మేము దాచుకున్న డబ్బులు ఇవ్వరు. కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించరు.

ఒకటో తేదీన ఇవ్వాల్సిన జీతాలు, పెన్షన్లు ఎప్పుడిస్తారో తెలియదు. ఇది ఉద్యమం కాదు ప్రభుత్వం మర్చిపోయిన పనిని తెలియజేస్తున్నాం.ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పీఆర్సీ ప్రకారం జీతాలు పెంచలేదు. ఇస్తున్న టీఏ లు వెనక్కు తీసుకోవటం దుర్మార్గం.స్మార్ట్ ఫోన్ అవగాహన లేని సీనియర్ ఉద్యోగులకు ఫేషియల్ అటెండెన్స్ వల్ల ఇబ్బందులు.ప్రభుత్వ ఉద్యోగులు శ్రమ దోపిడికి గురవుతున్నారు.ఉద్యోగులు అప్పులు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉద్యోగుల న్యాయబద్ధమైన రాయితీలు ఇస్తామని లిఖిత పూర్వక హామీ ఇస్తేనే ఉద్యమం ఆపుతామని స్పష్టం చేశాం..

Leave a Reply