Suryaa.co.in

Andhra Pradesh

మంగళగిరిలో నారా లోకేష్‌ రంజాన్‌ ప్రార్థనలు

ముస్లిం సోదరులకు యువనేత శుభాకాంక్షలు

ఈద్‌-ఉల్‌-ఫితర్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని యువనేత నారా లోకేష్‌ మంగళగిరి అంజుమన్‌-ఈ- హిమాయతుల్‌ ఇస్లాం ఈద్గాను గురువారం సందర్శించారు. ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన వారితో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈద్గా వద్ద యువనేతకు ఘనస్వాగతం లభించింది. క్రమశిక్షణ, దాతృ త్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ పర్వదినమని, దివ్య ఖురాన్‌ ఆవిర్భవించిం ది ఈ మాసంలోనేనని అన్నారు. అల్లా దయతో ఈ ఏడాది రాష్ట్ర ప్రజానీకానికి కష్టాల నుంచి విముక్తి కలగాలని లోకేష్‌ ఆకాంక్షించారు.

LEAVE A RESPONSE