ఒంగోలు జాతి పశు పోషకులను ప్రోత్సహించేందుకే జాతీయస్థాయి పోటీలు

– మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి

గుడివాడ, జనవరి 11: ఒంగోలు జాతి పశు పోషకులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆయన సోదరుడు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) లు గత ఐదేళ్ళుగా జాతీయస్థాయిలో ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నారని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా వెంకటరమణ (బాబ్జి) చెప్పారు.

మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని కే. కన్వెన్షన్లో జరుగుతున్న జాతీయస్థాయి పోటీల్లో భాగంగా రెండు పళ్ళ విభాగంలో పోటీ పడుతున్న ఎడ్ల జతల యజమానులకు ఆయన మెమెంటోలను బహుకరించారు. ఈ సందర్భంగా అడపా బాబ్జి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ
11-PHOTO-6 వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలే ఎక్కువగా కన్పిస్తుంటాయని చెప్పారు. గతంలో వ్యవసాయంలో ఎక్కువగా పశు వులను వినియోగించేవారని తెలిపారు. యాంత్రీకరణ పెరగడంతో పశువుల వినియోగం తగ్గుతూ వచ్చిందన్నారు. ముఖ్యంగా ఒంగోలు జాతి పశువులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టినిల్లు అని చెప్పారు. ఈ జాతి పశువులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.

అయితే ఒంగోలు జాతి పశువుల పోషణ నేటి రైతులకు భారంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో పశు పోషకులను ప్రోత్సహించేందుకు మంత్రి కొడాలి నాని, ఆయన సోదరుడు కొడాలి చిన్నిలు దృష్టి పెట్టారన్నారు. సంక్రాంతి అంటే ఎడ్లు, గంగిరెద్దులు వంటివి గుర్తుకొస్తుంటాయని, పండుగ వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహిస్తున్న ఈ జాతీయస్థాయి ఎడ్ల పోటీలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి పశు పోషకులు, రైతులు , ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని అడపా బాబ్జి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, గుడివాడ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి, ఎంపీపీలు పెయ్యల ఆదాం, గద్దె పుష్పరాణి, జడ్పీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నాయకులు పాలడుగు రాంప్రసాద్, గాదిరెడ్డి రామలింగారెడ్డి, మేకల సత్యనారాయణ, కొంకితల ఆంజనేయప్రసాద్, గిరిబాబాయ్, మూడెడ్ల ఉమా, దారం ఏడుకొండలు, చింతల భాస్కరరావు, వెంపటి సైమన్, దారం నరసింహా, కొలుసు నరేంద్ర, రేమల్లి పసి, ఆర్వీఎల్ నరసింహారావు, షేక్ సయ్యద్, యార్లగడ్డ సత్యభూషణ్, చుండి బాబి, పెద్ది కిషోర్, పొట్లూరి మురళీధర్, తోట రాజేష్, లోయ రాజేష్, ఎస్కే బాజీ, అలీబేగ్, చింతాడ నాగూర్, చిన్ని దుర్గాప్రసాద్, మాదాసు వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply