Suryaa.co.in

National

టోల్‌ చార్జీల పెంపు లేదు

-వాహనదారులకు ఉపశమనం
-వెనక్కు తీసుకున్న ఎన్‌హెచ్‌ఏఐ
-వాహనదారుల నుంచి
-వ్యతిరేకత నేపథ్యంలో నిర్ణయం

దేశవ్యాప్తంగా వాహనదారులకు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. టోల్‌ చార్జీల పెంపును వెనక్కు తీసుకుంది. సోమవారం నుంచి జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ వేలపై టోల్‌ చార్జీలు పెంచనున్నట్లు గతంలో ప్రకటించి న విషయం తెలిసిందే. దీనిని లారీల యజమానులు, వాహనదారులు తీవ్రంగా వ్యతిరే కించారు. ఈ నేపథ్యంలో టోల్‌ చార్జీల పెంపు నిర్ణయాన్ని ఎన్‌హెచ్‌ఏఐ వెనక్కి తీసుకుం ది. ప్రస్తుతం ఉన్న టోల్‌ రేట్లు కొనసాగుతాయని అధికారులు వెల్లడిరచారు.

LEAVE A RESPONSE