Suryaa.co.in

Andhra Pradesh

మీ వేళ్ళు కోసుకోవడం కాదు…

-జగన్ దుర్మార్గ పాలన పై వేటు వేయండి
– టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

రాష్ట్రంలో జగన్ అరాచక పాలనను దేశం దృష్టికి తీసుకువెళ్లేందుకు గుంటూరుకు చెందిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోపూరి లక్ష్మి తన వేలిని కోసుకున్నారన్న వార్త నన్ను కలచివేసింది. తమ ప్రాంతంలోని అక్రమాలను గురించి ఆమె ఇచ్చిన ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి ఉంటే నేడు ఇంత దారుణం జరిగి ఉండేది కాదు.

రాష్ట్రంలో ప్రజల నిస్సహాయస్థితికి ఇది నిదర్శనం. ప్రజలారా! మీ వేళ్ళు కోసుకోవడం కాదు… రేపటి ఎన్నికల్లో అదే వేలితో బటన్ నొక్కి, మీ ఓటు అనే ఆయుధంతో జగన్ దుర్మార్గ పాలన పై వేటు వేయండి. అంతేగాని నిర్వేదంతో, నిస్పృహతో ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని కోరుతున్నా. ఇవి సమస్యలకు పరిష్కారం చూపవు. రేపు కూటమి ప్రభుత్వం వచ్చాక…మాఫియా గాళ్లను రాష్ట్రం నుంచి తరిమేద్దాం. అక్రమాలను అణిచేద్దాం.

LEAVE A RESPONSE