Suryaa.co.in

Andhra Pradesh

నర్సింగ్ ఉద్యోగుల ఆందోళన

విశాఖ : అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం జగన్ కు నిరసనల సెగ ఎదురవుతుంది. విశాఖలో కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మాకు కొత్త హామీలు ఇవ్వనవసరం లేదు.. ఇచ్చిన హామీలను అమలు చేస్తే చాలని మండిపడ్డారు. కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి పోరాడిన మాకు.. ప్రభుత్వం ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సింగ్ ఉద్యోగల సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నారు.

LEAVE A RESPONSE