తెలంగాణా ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు ఖరారు చేయడం పట్ల ఉప సభాపతి పద్మారావు గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. సితాఫలమండీ లోని ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయం వద్ద కార్పొరేటర్లు, నేతలతో కలిసి బాబా సాహెబ్ చిత్ర పటానికి, సీ ఎం కే సీ ఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నివహించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ భారత దేశ అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందుబాటులోకి వచ్చేలా అంబేద్కర్ కృషి చేసిన మహానీయుడని తెలిపారు. తెలంగాణా ప్రభుత్వం, ముఖ్యమంత్రి కే సీ ఆర్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను నిరంతరం గుర్తుంచుకొనేలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్పొరేటర్లు రాసురి సునిత, లింగాని ప్రసన్న లక్ష్మి, సామల హేమ, కంది శైలజ, నేతలు మోతే శోభన్ రెడ్డి, కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, లింగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Devotional
బ్రహ్మ కడిగిన పాదం
– ఏమిటా సందర్భం? పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగ- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి…
అక్షయ తృతీయ రోజునే చందనోత్సవం ఎందుకు ?
సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజరూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ? పూర్వం తన భక్తుడైన…
Sports
అథ్లెటిక్స్ క్రీడాకారులతో ముచ్చటించిన మోదీ
న్యూఢిల్లీ: ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ 2024లో పాల్గొనేందుకు పారిస్ వెళ్తోన్న భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ముచ్చటించారు. జట్టులో మొత్తం 28 మంది సభ్యులుండగా గత ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా భారత్కు నాయకత్వం వహిస్తున్నారు.క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన…
ఐసీసీ ఛైర్మన్గా జై షా?
ఐసీసీ ఛైర్మన్గా జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్ బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురులేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా…