– తుపాకీ పట్టినోడు ఆ తుపాకికే బలిగాక తప్పదు
– ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పెహల్ గాం ఘటన
– బిచ్చమెత్తుకునే దుస్థితికి చేరినా పాక్ బుద్ది మారడం లేదు
– మోదీ సర్కార్ తీసుకునే కఠిన నిర్ణయాలకు అండగా నిలవండి
– రోజ్ గార్ మేళా మోదీకి ఇష్టమైన కార్యక్రమం
– 10 లక్షల ఉద్యోగాల భర్తీ మార్క్ కు చేరుకున్నాం
– కష్టపడి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు హ్యాట్సాప్
– ఇష్టపడి పనిచేసి దేశానికి సేవ చేయండి
– హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీ లో ‘రోజ్ గార్ మేళా’లో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
– ఉద్యోగాలకు ఎంపికైన 100 మందికి అపాయిట్ మెంట్ లెటర్లు అందజేత
హైదరాబాద్; ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పెహల్ గాం ఘటన అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తుపాకీ పట్టినోడు చివరకు ఆ తుపాకీకే బలికాక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా పాకిస్తాన్ వెన్నులో వణుకుపుట్టేలా చర్యలుండబోతున్నాయని అన్నారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోబోతోందని, ఇందుకు యావత్ దేశం అండగా నిలవాలని కోరారు.
హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివ్రుద్ది కేంద్రంలో నిర్వహించిన ‘రోజ్ గార్ మేళా’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తోపాటు జీఎస్టీ చీఫ్ కమిషనర్లు సందీప్ ప్రకాశ్, వి.సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కి అత్యంత ఇష్టమైన కార్యక్రమం ‘‘రోజ్ గార్ మేళా’’. 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానన్న మాట నిలబెట్టుకున్న నాయకుడు మోదీ. 2022 అక్టోబర్ 22న ‘ప్రారంభమైన రోజ్ గార్ మేళా’ నేటికీ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 14 రోజ్ గార్ మేళాలను నిర్వహించి 9 లక్షల 25 వేల ఉద్యోగాలను భర్తీ చేసినం.
ఈరోజు 15వ రోజ్ గార్ మేళా ద్వారా దేశవ్యాప్తంగా 51 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం. అంటే దాదాపు 10 లక్షల మార్క్ కు చేరుకున్నట్లే… ఏ చిన్న అవినీతికి, పొరపాట్లకు తావులేకుండా నిర్ణీత గడువులోగా ఇన్ని లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం మామూలు విషయం కాదు. మోదీ ప్రభుత్వానికి ఆ ఘనత దక్కింది. వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో ఖాళీలుంటే.. ఇతర ఉద్యోగులపై భారం పడుతోంది.
తద్వారా మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించడం కష్టమైంది. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు ఏ శాఖలో ఖాళీగా ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు ఆయా పోస్టులను ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేసిన దాఖలాల్లేవ్. ఆ ఘనత మోదీకే దక్కుతోంది.
దేశవ్యాప్తంగా ఈరోజు 47 కేంద్రాల్లో రోజ్ గార్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. 51 వేల మందికి అపాయిట్ మెంట్ లెటర్లు ఇవ్వడం గొప్ప విషయం. మన రాష్ట్రం విషయానికొస్తే హైదరాబాద్ సికింద్రాబాద్ లో నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ ఎంసీహెచ్ఆర్డీ కేంద్రం నుండి సుమారు 700 మంది అభ్యర్థులు నియామక పత్రాలు అందుకోబోతున్నారు.
వీరిలో 100 మంది అభ్యర్థులకు నా చేతుల మీదుగా నియమాక పత్రాలు అందించడం ఆనందంగా ఉంది. ఈరోజు అపాయిట్ మెంట్ లెటర్లు అందుకోబోతున్న అభ్యర్థులకు, వారి కుటుంబ సభ్యులకు నా శుభాకాంక్షలు. వాస్తవానికి ఒక్కో పోస్టుకు భారీ ఎత్తున పోటీ నెలకొంది. ఆ పోటీని తట్టుకుని పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉద్యోగం సాధించిన మీ అందరికీ హ్యాట్సాఫ్..
ఎంతో కష్టపడి చదువుకుని ఉద్యోగం సాధించిన మీరంతా ఇకపై మీకప్పగించిన బాధ్యతలను ఇష్టపడి నిర్వర్తించి మంచి గుర్తింపు తెచ్చుకోండి. ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే టెక్నాలజీని, ఉద్యోగాల్లో వస్తున్న మార్పులను గమనిస్తూ నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగండి. మీకు తెలుసు. ఉద్యోగావకాశాల సృష్టికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నది మోదీగారి సంకల్పం. అందుకే 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసుకోగలిగాం. మాట ఇస్తే నెరవేర్చే ప్రభుత్వం నరేంద్రమోదీదే. గతంలో క్రమం తప్పకుండా వివిధ శాఖల్లోని ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసిన దాఖల్లేవు. ఆ ఘనత మోదీకే దక్కుతోంది.
అంతేగాదు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా పేరుతో ఉద్యోగాలు చేసే స్థాయి నుండి ఉద్యోగాలు స్రుష్టించే స్థాయికి మన భారతీయ యువతను ప్రోత్సహిస్తున్నారు. కరోనా హయాంలో అమెరికాసహా ప్రపంచమంతా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోతే ఆత్మ నిర్భర్ ప్యాకేజీతో భారత్ ను ఆర్ధికంగా స్థిరంగా ఉంచిన ఘనత మోదీ ప్రభుత్వానిదే.
పేదలకు బ్యాంకు ఖాతాలు లేని పరిస్థితుల్లో ‘జన్ ధన్ ఖాతా’లను జీరో బ్యాలెన్స్ తో ప్రారంభిస్తామని చెబితే ప్రతిపక్షాలన్నీ హేళన చేశాయి. ఈరోజు దేశంలో బ్యాంకు ఖాతా లేని ప్రతి ఒక్కరికి జన్ ధన్ ఖాతాను ప్రారంభించి నయాపైసా అవినీతికి తావులేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది నగదును నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఒకనా- నిత్యావసర వస్తువులు సహా అనేక వస్తువులను భారత్ దిగుమతి చేసుకునేది. మోదీ హయాంలో బియ్యం, నిత్యావసర వస్తువులుసహా అనేక ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తీసుకొచ్చారు.
మన రాష్ట్రం విషయానికొస్తే… గత ప్రభుత్వం క్రమం తప్పకుండా ఉద్యోగాలను భర్తీ చేయడంలో విఫలమైంది. పేపర్ లీకేజీలు, కాలయాపనతో నిరుద్యోగులకు అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వంలో కూడా అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం వాటికి తావులేకుండా క్రమం తప్పకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి.
అంతేగాకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో భారత్ ఆర్ధిక ప్రగతిలో అగ్రభాగాన నిలిచేందుకు నిరంతరం క్రుషి చేస్తున్నారు. గతంలో 11వ స్థానంలో ఉన్న భారత్ ను 5వ స్థానంలో నిలిపారు. మరో మూడేళ్లలో 3వ స్థానానికి తీసుకువచ్చే దిశగా పనిచేస్తున్నారు. అట్లాగే భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా అప్పటికి అమెరికా, చైనాను అధిగమించి భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ కావాలన్నదే మోదీ ఆకాంక్ష. మోదీ జీ కృషి లో మీరంతా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా