Suryaa.co.in

Andhra Pradesh

ఆర్ధిక సంఘం ప్రతినిధులతో కృష్ణాతీరాన విందు సమావేశం

– మన రాష్ట్ర హస్తకళల వైవిధ్యాన్ని వివరించిన ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్
– ఔరా మన హస్తకళలు.. అంటూ కొనియాడిన ఆర్ధిక సంఘం ప్రతినిధులు

అమరావతి: 16వ ఆర్దిక సంఘం ప్రతినిధులు మన రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాతీరానగల హరిత హోటల్, బెర్మ్ పార్క్‌లో మర్యాదపూర్వక విందు సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మన రాష్ట్రంలో ప్రఖ్యాతగన్న గిరిజన హస్తకళల ప్రదర్శన స్టాళ్ళను సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.

సృజనాత్మకతకు అద్దంపట్టే విధంగా హస్తకళ కళాకారులు ప్రదర్శించిన చేనేత మగ్గం, జముకు వాయిద్యం వంటి సంప్రదాయ వస్తువులు, తోలు బొమ్మలాట వంటి కళాకృతులు, ప్రదర్శనల వైవిధ్యాన్ని, వాటి ప్రత్యేకతల గురించి అతిధులైన ఆర్థిక సంఘం చైర్మన్, ఇతర సభ్యులకు ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ గారు దగ్గరుండి ఆయా విశేషాలను తెలియజేశారు.

మన రాష్ట్ర సంప్రదాయ కళాసంస్కృతికి అద్దంపట్టిన ఈ విందు సమావేశ కార్యక్రమంలో 16వ ఆర్ధిక సంఘం ప్రతినిధులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , వివిధ శాఖల మంత్రులు, ప్రభుత్వ ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE