Suryaa.co.in

Andhra Pradesh

పిన్నెల్లికి హైకోర్టులో ఊరట

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. ఈవీఎంల ధ్వంసం సహా 4 కేసుల్లో మధ్యంతర ముందస్తు బెయిల్ ను పొడిగించింది. వారంపాటు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులపై గురువారం తదుపరి విచారణ చేస్తామని తెలిపింది. కాగా పిన్నెల్లిని అరెస్టు చేస్తారని ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే.

LEAVE A RESPONSE