కేసీఆర్ పాలనను తరిమి తరిమి కొట్టేందుకే ప్రజా సంగ్రామ యాత్ర

-జోగులాంబ తల్లి చేసిన పాపమేంది? అధికారికంగా ఉత్సవాలేవి?
-రంజాన్ పండుగొస్తే ప్రత్యేక జీవోలిచ్చి నమాజ్, ఇఫ్తార్ లకు వెళ్లేలా చేశారే…
-మరి అయ్యప్ప, హనుమాన్, శివ మాల వేసుకునే వారికి ఎందుకు జీవో ఇవ్వలేదు?
-బీజేపీ అధికారంలోకి వస్తే ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తాం…
-అయ్యప్ప, శివ, హనుమాన్ భక్తులు ప్రత్యేక పూజలు చేసుకునేలా జీవోలిస్తాం
-మాదాసు కురుమ, వాల్మీకీ బోయ సమస్యలను పరిష్కరిస్తాం
-ఉచిత నాణ్యమైన విద్య, వైద్యం అందించి తీరుతాం
-పైసల సంచులు పట్టుకుని రాష్ట్రాలు తిరగడం కాదు … జనంలోకి రా…
-రేపటి నుండి కేసీఆర్ భాగోతాన్ని బయటపెడతా…
-ప్రతి గడపనూ తాకి సమస్యలు తెలుసుకుంటా…
-జోగులాంబ అమ్మవారి ఆలయం వద్ద జరిగిన బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,ఎంపీ -బండి సంజయ్ కుమార్ ఫైర్…

తెలంగాణలో కేసీఆర్ పాలనను తరిమికొట్టేదాకా ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. ప్రతి గడప గడపకూ వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు కేసీఆర్ అరాచక, నయా నిజాం పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించి చైతన్యం చేస్తామన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే జోగులాంబ అమ్మవారి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. రంజాన్ తరహాలోనే అయ్యప్ప, శివ, హనుమాన్ భక్తులు మాల ధారణ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకునేలా వెసులు బాటు కల్పిస్తూ ప్రత్యేక జీవోలిస్తామని స్పష్టం చేశారు.

పాదయాత్ర కేసీఆర్ భాగోతాన్ని బయటపెడతానని… అవినీతి టీఆర్ఎస్ పాలకులను నిద్రపోనివ్వనని హెచ్చరించారు. బీజేపీ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభాన్ని పురస్కరించుకుని అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం వద్ద బహిరంగ సభలో బండి సంజయ్ ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు. బండి సంజయ్ రాకను పురస్కరించుకుని ఆకాశాన్ని అంటేలా బాణా సంచా కాల్చి కార్యకర్తలు వేదికపైకి స్వాగతం పలికారు. వేలాది మంది కార్యకర్తల నినాదాలు, సంబురాలతో కోలాహలంగా మారిన సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు.

ఈ సమావేశానికి బండి సంజయ్ తో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్
tarun కే.లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ సోయం బాపూరావు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, విజయశాంతి, జితేందర్ రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామి, గరికపాటి రామ్మోహన్ రావు, చాడ సురేష్‌రెడ్డి సహా పలువురు సీనియర్ నేతలు, రాష్ట్ర పదాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కు మాదాసు కురమ సంఘం నాయకులు తమ సమస్యలను పరిష్కారానికి పోరాటం చేయాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా మాదాసు కురమ, వాల్మీకి బోయ సామాజికవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సంజయ్ ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు..

భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీర్వాదంతో మొదటి విడత పాదయాత్ర విజయవంతం అయింది… ఈ రోజు జోగులాంబ అమ్మవారి పాదల చెంత నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నాం. అక్కడ అమ్మవారే.. ఇక్కడ అమ్మవారే… అమ్మవార్ల ఆశీర్వాదంతోనే ముందుకెళ్తున్నం.

ఈ స్థలం ఎంతో శక్తివంతమైనది. భారత దేశంలో పవిత్రమైన అష్టాదశ శక్తి పీఠాల్లో జోగులాంబ క్షేత్రం కీలకమైనది. అమ్మవారిని దర్శించుకుంటే నాకు వైబ్రేషన్స్ వచ్చినయ్.. కేసీఆర్ బట్టలు చింపుకునే హిందువునని అంటాడు కదా… మరి జోగులాంబ తల్లి ఏం తప్పు చేసింది? ఇక్కడి ప్రజలు చేసిన పాపమేంది?

కర్ణాటకలో మైసూరులోని చండీమాత అమ్మవారు, విజయవాడలో కనకదుర్గ అమ్మవారి ఆలయాల్లో అధికారికంగా దసరా ఉత్సవాలు జరుగుతయ్. కానీ అష్టాదశ శక్తి పీఠమైన జోగులాంబ అమ్మవారి దగ్గర మాత్రం ప్రభుత్వం ఉత్సవాలు జరపదు. ఎందుకు? మీరు ఎట్లాగు చేయరు, బీజేపీ అధికారంలోకి వచ్చాక దసరా ఉత్సవాలను అధికారికంగా ఘనంగా నిర్వహిస్తాం.

కేసీఆర్ కు మైనారిటీలంటే భయం… ఆయనను వదిలిపెట్టను. 15 నిమిషాలు సమయమిస్తే.. ఈ దేశంలోని హిందువులందరినీ చంపుతానన్న ఎంఐఎం నేతపై సాక్షాధారాలను ప్రభుత్వం సమర్పించకపోవడంవల్లే కేసు కొట్టేసింది. అయినా ఎంఐఎం నేతను వదిలిపెట్టే ప్రసక్తే లేదు… కేసులు తిరగదోడుతాం… ఛత్రపతి శివాజీ మహారాజ్ దర్శించుకున్న స్థలం ఇది… ఈ పవర్ ఫుల్ టెంపుల్ నుండి రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ కూడా స్టార్ట్ చేస్తున్నం.

శివాజీ మహారాజ్ ఎట్లయితే హిందూ ద్రోహుల తల నరుక్కుంటా పోయిండో…. మనం అవినీతి-నియంత-కుటంబ పాలనను అంతం చేసేందుకు కంకణం కట్టుకుని బయలుదేరుతున్నం…. ఏయ్ సీఎం.. మమ్మల్ని మతోన్మాదులు అంటావా… మైనార్టీ ఓట్లకోసం హిందు సమాజాన్ని, హిందూ దేవాలయాలకు అవమానం చేస్తుంది నువ్వు కాదా. కేసీఆర్ హిందూ ద్రోహి….

రంజాన్, బక్రీద్ కోసం అయితే నమాజ్ కోసం, ఇఫ్తార్ కోసం స్పెషల్ పర్మిషన్ల కోసం జీవో లు ఇస్తావు…మరి నా అయ్యప్ప, శివ, హనుమాన్ భక్తులు ఏం చేశారు? నా అయ్యప్ప స్వాముల కోసం, హనుమాన్ మాల భక్తుల కోసం, శివ భక్తుల, అమ్మవారి భక్తుల కోసం భిక్షకు టైం ఇవ్వవు. దీక్ష తీసుకున్నోళ్లు డ్యూటీకి, స్కూలుకు రావద్దని అంటున్నావు… ఎందుకన్నా ఈ ప్రభుత్వం. (స్వామియే శరణం అయ్యప్ప…. జై శ్రీరాం… రామ లక్ష్మణ జానకీ… హర హర అంటూ సభకు హాజరైన వారు చేసిన శరణఘోషతో దద్దరిల్లిన సభ).

బీజేపీ అధికారంలోకి వచ్చాక అయ్యప్ప, హనుమాన్, శివ మాల ధరించే భక్తులకూ ప్రత్యేక జీవోలిచ్చి స్వేచ్ఛగా పూజలు, భిక్ష చేసుకునేలా వెసులు బాటు కల్పిస్తాం… పైసల సంచులు పట్టుకుని వేరే రాష్ట్రాలకు తిరగడం కాదు … జనంలోకి రా… ఈ పాలమూరు జిల్లాకు రా నీకు ఇక్కడికి వచ్చే ధైర్యం లేదని నాకు తెలుసు. నువ్వు ఢిల్లీకి పోయినావు… నేను పాలమూరు గల్లీకు వచ్చినా…
వడ్ల పేరుతో ఢిల్లీలో దొంగ దీక్ష చేసినవ్ … నేను రైతుల దగ్గరకే వచ్చినా…నువ్వు ప్రగతి భవన్లో ఫామ్ హౌజ్ లో ఉంటవ్……నేను జనం మధ్య ఉంటా…. 2014 ఎన్నికలకు ముందు ఇదే జోగులాంబ ఆలయం నుండి బయలుదేరిన కేసీఆర్ ఏమన్నావో… గుర్తుందా?తుంగభద్ర పుష్కరాల్లో ఏం చెప్పినవ్….ఎన్ని హామీలిచ్చినవో యాదికుందా?…. అందులో ఒక్కటైనా చేసినావా…. ఇక్కడనే కాదు ప్రాణహిత పుష్కరాలను పట్టించుకుంటలేవు….

రేపట్నుంచి నీ సంగతి చెబుతా… 2014 ఎన్నికల ముందు జోగులాంబ ఆలయం నుండి స్టార్ట్ అయిన కేసీఆర్ ఏమన్నవ్? పుష్కరాల్లో ఏమన్నావ్?…ప్రాణహిత పుష్కరాల సంగతేంది? ఆర్డీఎస్ ఆధునీకరణ….
sanj కుర్చీ వేసుకుని కూర్చుంటా… అన్నీ జూఠా మాటలే.. పాలమూరు బిడ్డలు నిన్ను ఎంపీ ఢిల్లీకి పంపిండ్రు.. తెలంగాణ వచ్చినంక వాళ్ల నోట్లో మట్టికొట్టినవ్…పక్క రాష్ట్రం సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి సహకరించినవ్… ఈ ప్రాంతానికి అటుపక్కన తుంగభద్ర….ఇటు పక్కన క్రిష్ణమ్మ ఉంటది…అయినా పడావే…

పాలమూరులో వలసలు ఆగినయా…వలస పోయినోళ్లు తిరిగొస్తున్నరా…. నెల రోజులు ఈడనే ఉంటా.. ఏ వూరికొస్తవ్… కల్వకుర్తి, అచ్చంపేట.. ఏ బస్టాండ్ కు పోదాం? ఖాళీగా పోయే బొంబాయి చూపిస్తవా? నీ దొంగ లెక్కలతో పాలమూరు పచ్చబడ్డదని చెబుతావ్… నీ పింకీగాళ్లు, డాంకీ గాళ్లు కోట్లు సంపాదించుకుని పచ్చబడ్డరు. ఈ ఏడేళ్లో ఒక్క ప్రాజెక్టైనా కొత్తది కట్టినవా? ఒక్క ఎకరానికైనా కొత్తగా నీళ్లిచ్చినవా? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు యాడిదాకా వచ్చింది?

• ఇప్పటికీ తెలంగాణ వచ్చి ఏడేళ్లయినా అలంపూర్ లో, గద్వాల జిల్లాలో చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా పక్క రాష్ట్రం కర్నాటక పోవాలే… నీ మాయ మాటలు నమ్మి మా పాలమూరు బిడ్డలు నిన్ను, నీ పార్టీని గెలిపిస్తే… ఏం చేసినవ్? పదవులు పొంది పండగ చేసుకున్నవ్… మా మహబూబ్ నగర్ జిల్లా ప్రజల కడుపులు మాడగొట్టినవ్… నమ్మక ద్రోహివి నువ్వు…. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజానీకమంతా గుర్తించింది.

ఈ వేదిక నుండే చెబుతున్నా….. నీ పతనాన్ని బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు… నిన్ను నీ పార్టీని కట్టకట్టి ప్రజలు తుంగభద్రలో పడేయటం ఖాయం.. వడ్ల కొనబోమని చెప్పి రైతులను 4 నెలల నుండి అరిగోస పెట్టినవ్… నేను మొదటి నుండి చెబుతున్నా… వడ్లు కొనేది… పైసలిచ్చేది కేంద్రమేనని చెబుతున్నా. ఈ ఏడేళ్లలో 97 వేల కోట్ల రూపాయలు ఇచ్చినం.అయినా రైతులు మనోవేదనకు గురి చేసిండు… వరి వేస్తే ఉరే అన్నడు. కేంద్రం కొంట లేదన్నడు. కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తానన్నడు….

మీ మద్దతుతో ఉద్యమం చేసినం…. ధర్మమే గెలిచింది… కేసీఆర్ మెడలు వంచి వడ్లు కొనేలా చేసినం…. ఇది మీ విజయం…బీజేపీ విజయం…ఈ ముఖ్యమంత్రి పచ్చి శాడిస్టు… సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులను అరిగోస పెట్టిండు… పదుల సంఖ్యలో కార్మికులు చచ్చిపోయినంక మళ్ల ఉద్యోగంలోకి తీసుకుండు.17 జీవో ద్వారా ఉద్యోగులను అరిగోస పెట్టిండు… దాదాపు 40 మంది ఉద్యోగులను బలి చేసిండు… కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి చెట్టుకొకరిని పుట్టకొకరిని చేసిండు..ప్రజాలారా… ఆ వర్గాన్ని ఈ వర్గాన్ని కాదు… సబ్బండ వర్గాలను మోసం చేసిన దుర్మార్గుడు ఈ సీఎం…

ఈరోజు… పవిత్రమైన దినం… ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన రోజు. ఆ మహనీయుడు అందించిన రాజ్యాంగమే అవసరం లేదంటున్నడు. ప్రపంచమంతా గొప్పగా కీర్తిస్తున్న రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటున్న ఈ సీఎం ఎంతటి దుర్మార్గుడో అర్దం చేసుకోండి.

ఏయ్ సీఎం… నువ్వు రాజ్యాంగం మార్చాలనుకుంటున్నవేమో…. ఆ ఆలోచననే చంపేస్తా… నీ రాజకీయ పునాదులే కూల్చివేస్తాం… తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తొలి విడత పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసినం…. ఇప్పుడు మీ మద్దతుతో రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టినం.
మొదటి ప్రజాసంగ్రామ యాత్రతలో ఉచిత విద్యా, వైద్యం అందిస్తాం అని ప్రకటించినం… ఈ జోగులాంబ అమ్మవారి పాదాల సాక్షిగా చెబుతున్న మేం అధికారంలోకి రాగానే పేదలకు నాణ్యమైన విద్యా, వైద్యం అందిస్తాం…పల్లెలన్నీ తిరుగుతాం… పట్టణాలు తిరుగుతాం… సమస్యలను తెలుసుకుంటాం… కల్వకుంట్ల ప్రభుత్వ అరాచక ప్రభుత్వాన్ని అంతమొద్దిద్దాం…. మీరు కోరుకున్న ప్రజాస్వామిక తెలంగాణను ఏర్పాటు చేస్తాం…

నా యాత్ర ఆగదు… ప్రజల బతుకుల్ని ఆగం చేసిన నిన్ను నిద్రపోనివ్వ…పాలమురు బిడ్డల్లారా ఇదే ఆఖరిపోరాటం… పాలమూరు వలసలు ఆగాలంటే… పడావుపడ్డ భూములు పచ్చ పడాలంటే,
sanj2 నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే… బీజేపీ అధికారంలోకి రావాల్సిందే… నడవండి… మాతో కదలిరండి… ఈ సంగ్రామ యాత్రతో మన ఆశయాలను సాధిద్దాం… భారత్ మాతాకీ జై…

Leave a Reply