– వెయ్యేళ్ల క్రితమే దక్కన్ ప్రాంతంలో వరి ధాన్యం పండించిన చరిత్ర తెలంగాణ రైతులది
ఆంధ్ర పాలకుల మన్ననల కోసం ఇంకా ప్రాకులాడడం సిగ్గు చేటు
– రైతు మహోత్సవ వేడుకలు జరపడం..చంపినోడే సంతాప సభ పెట్టినట్టు ఉంది
– తెలంగాణ రైతులను అవమానించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ సమాజానికి బే షరతుగా క్షమాపణ చెప్పాలి
– తెలంగాణ రైతులకు వ్యవసాయం ఆంధ్ర ప్రాంతం వారు నేర్పించార్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ రైతులకు ఆంధ్రప్రాంతం వారు వ్యవసాయం నేర్పించారని పీసీసీ అధ్యక్షుడు మాట్లాడడం యావత్ తెలంగాణ సమాజాన్ని అవమాన పరిచినట్టే. రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు మహోత్సవ వేడుకలు జరపడం..చంపినోడే..సంతాప సభ పెట్టినట్టు ఉంది.
కేసీఆర్ చెప్పేది అక్షర సత్యం..బిఆర్ఎస్ కు తప్పా తెలంగాణ మీద ప్రేమ ఏ రాజకీయ పార్టీకి ఉండదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్ర భావదారిద్ర్యం లో ఉన్నారు. ఆంధ్ర పాలకుల మన్ననల కోసం ఇంకా ప్రాకులాడడం సిగ్గు చేటు. నాడు తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడ్డ సమైక్య పాలకుల అడుగులకు మడుగులొత్తిన కాంగ్రెస్ నాయకులు..ఇప్పుడు సొంత రాష్ట్రంలో ఉన్నామనే సోయి మరిచినట్టు ఉన్నారు.
తెలంగాణ వ్యవసాయ చరిత్ర తెలియని వ్యక్తులు, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కు పాలకులు కావడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. ఆంధ్రలోని కోస్తా ప్రాంతంలో వరి తప్పా ఏది పండించరు. కానీ తెలంగాణ రైతులు వరితో పాటు వాణిజ్య పంటలైన పత్తి,పసుపు,చెరుకు, మిర్చి,మక్క జొన్న పంటలు పండిస్తారు. పల్లి,పెసర,శనగ,కందులు,మినుములు లాంటి ఆహార ధాన్యాలు పండిస్తారు.
వెయ్యేళ్ల క్రితమే దక్కన్ ప్రాంతంలో వరి ధాన్యం పండించిన చరిత్ర తెలంగాణ రైతులది.
వ్యవసాయ రంగంలో నిష్ణాతులైన తెలంగాణ రైతులను అవమానించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెంటనే యావత్ తెలంగాణ సమాజానికి బే షరతుగా క్షమాపణ చెప్పాలి.” అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.