Suryaa.co.in

Andhra Pradesh

క్విట్ జగన్ –సేవ్ ఏపీ

-ప్రజల ట్రెండ్ మారింది..వైసీపీ బెండు తీస్తారు
-ఐదేళ్లలో కడప స్టీల్ ప్లాంట్ కట్టలేని దద్దమ్మ జగన్
-సీమ అభివృద్ధిపై మాట్లాడే అర్హత జగన్ కు లేదు
-చిన్నాన్నను చంపిన నిందితున్ని ఎంపీగా నిలబెట్టి ఓట్లేయమంటావా.?
-కులం, మతం, ప్రాంతం చూసి ప్రజలు మోసపోవద్దు
-వచ్చే ఐదేళ్లలో రాష్ట్రం స్వర్ణయుగం వైపు
-రాచమల్లు…ప్రొద్దుటూరుకు రాచముల్లు
-ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా వరదరాజులు రెడ్డిని, కడప ఎంపీగా భూపేష్ రెడ్డిని గెలిపించండి
-ప్రొద్దుటూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

ప్రొద్దుటూరు : ‘కడప జిల్లాలో సైకిల్ దూకుడు ఎవరూ ఆపలేరు. ప్రొద్దుటూరు ప్రజలను చూసి మండుటెంటే భయపడుతోంది. మీరు ఏ పెత్తందారులకూ బానిసలు కాదు. ఎన్డీఏ గెలుపు అన్ స్టాపబుల్. మొన్న ఇక్కడ సభ పెట్టిన సీఎం జగన్ రెడ్డి ఏడు నియోజవకర్గాల నుంచి జనాన్ని పోగేసుకొచ్చాడు. క్వార్టర్ ఇచ్చి బిర్యానీలు పెట్టాడు. ఏమైంది? నీది జిల్లా మీటింగ్. నాది ప్రొద్దుటూరు మీటింగ్. నీది సాయంత్రం వెన్నెల్లో మీటింగ్ . నాది ఎండలో మీటింగ్ . ఇది నాపై ప్రజల నమ్మకం. అది నీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత.

సీఎం సభ నుంచి జనం వెళ్లకుండా పోలీసులు బతిమాలుకున్నారు. రాయలసీమకే గుండెకాయ వంటి ప్రొద్దుటూరు నుంచి నేను ముఖ్యమంత్రికి సవాల్ విసురుతున్నా. ఐదేళ్లలో రాయలసీమకు ఏమైనా చేశావా? పోనీ కడపకు, పులివెందులకు ఏమైనా చేశావా? రెండుసార్లు స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశావుగా. అదే నేనైతే ప్రారంభోత్సవం చేసేవాడిని. అదీ నా బ్రాండ్ . రాయలసీమలో తాగునీటి ప్రాజెక్టుల గురించి ఒక్క మాట మాట్లాడాడా ఈ ముఖ్యమంత్రి? కనీసం సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో ఏం చేశావో చెప్పే ధైర్యం నీకుందా?

పులివెందుల ప్రజలు సైతం జగన్ ను నమ్మడం లేదు
జగన్ కు సీమ అంటే హింసా రాజకీయాలు, హత్యా రాజకీయాలు, పెత్తందారీ పోకడలు, సహజనవనరుల దోపిడీ, హత్యలు…అదే టీడీపీకి రాయలసీమ అంటే…..నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, డ్రిప్ ఇరిగేషన్, యువతకు ఉద్యోగాలు, హార్టికల్చర్ హబ్ గా సీమను చేసి రైతును రాజు మార్చడం. నిన్ను గెలిపించిన పులివెందుల ప్రజలు సైతం నిన్ను నమ్మమంటున్నారు. ప్రజల్లో మార్పు వచ్చింది ట్రెండ్ మారింది. వైసీపీ బెండు తీస్తారు.

నాకు ప్రాణ సమానమైన టీడీపీ కార్యకర్తలను నేను మర్చిపోను. దశాబ్ధాలుగా టీడీపీ జెండా మోస్తున్నారు. నందం సుబ్బయ్య వంటి వారిని చంపినా కార్యకర్తలు భయపడలేదు. జై జగన్ అని చెప్తే వదిలేస్తామన్నారు. కానీ మన కార్యకర్తలు జై టీడీపీ…జై చంద్రబాబు అన్నారు. టీడీపీ కార్యకర్తలంటే బానిసలు కాదు…మీ పోరాటానికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా. తొందరలోనే మీ రుణం తీర్చుకుంటా.

నీటి విలువ తెలియని వ్యక్తి జగన్
జన సైనికులు కూడా ఇక్కడే ఉన్నారు. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా , పేదలకు న్యాయం జరగడమే ఆశయంగా పవన్ కల్యాణ్ పనిచేస్తున్నారు. జగన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల కూడదని పొత్తు పెట్టుకుంటున్నట్టు చెప్పారు. పవన్ కల్యాణ్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్నా. రాష్ట్రంపై రూ. 12 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ దోపిడీ దారు జగన రెడ్డికి సంపద సృష్టి చేతకాదు. కడప స్టీల్ ప్లాంట్ వచ్చుంటే లక్షలమందికి ఉద్యోగాలు వచ్చేవి. కానీ చేతకాని జగన్ రెడ్డి మొత్తం నాశనం చేశాను.

నేను కియా తెచ్చాను. గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి నీళ్లిచ్చా. ఇవాళ 12 లక్షల కార్లు కరువు సీమలో తయారై ప్రపంచమంతా పరుగులు పెడుతున్నాయి. నా బ్రాండ్ కియా తేవడం..జగన్ రెడ్డి బ్రాండ్ …స్టీల్ ప్లాంట్ కు మళ్లీ మళ్లీ రిబ్బన్ కటింగ్ చేయడం. కప్పం చెల్లించలేక కియా , అమర్ రాజా పక్క రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి. సీమ గతిని మార్చేది నీళ్లు,విద్య, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు. ఇది జరిగితే రాయలసీమ…కోనసీమగా తయారవుతుంది. జగన్ రెడ్డికి నీటి విలువ తెలుసా? శ్రీశైలం, రాజోలు బండ ఎక్కడున్నాయో జగన్ రెడ్డికి తెలుసా?

ఏమీ తెలియక పోయినా అన్నీ తెలిసినట్టు కమల్ హాసన్ ను మించి నటించే నటుడు జగన్ రెడ్డి. గత ఎన్నికల్లో చిన్నాన్న చావును వాడుకున్నాడు . అతని మాటలు విని ఓటేశారు. ఏమైంది? సీమలో 49 సీట్లు గెలిపించారు..ఏమైనా చేశాడా? గెలిచాక ప్రజలను మరిచిపోయి అవినాష్ రెడ్డిని కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టాడు.

నేను రూ. 12 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెడితే, జగన్ రెడ్డి రూ. 2 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. ప్రతి ఎకరాకు నీరివ్వాలని ఆలోచన చేశా. గండికోట పూర్తి చేసి పులివెందులకు నీరిచ్చిన పార్టీ తెలుగుదేశం. హంద్రినీవా నుంచి కుప్పానికి నీళ్లివ్వలేని దుర్మార్గుడు జగన్ రెడ్డి. సాక్షి పత్రికకు వేల కోట్ల ప్రజాధనంతో ప్రకటనలు ఇచ్చారు. ప్రభుత్వ సలహాదారుల పేరుతో గుమాస్తాలను పెట్టుకున్నాడు.

ఐదేళ్లలో కడపకు ఒక్క పరిశ్రమైనా వచ్చిందా.?
కృష్ణా జలాలు రాయలసీమకు తేవాలనేది ఎన్టీఆర్ కల. గోదావరి జలాలు రాయలసీమకు తేవాలని, పోలవరం పూర్తి చేయాలని నా కల. ఈ ఐదేళ్లు నేనుంటే గోదావరి నీటితో రాయలసీమ సస్యశ్యామలం అయ్యేది. మిమ్మల్ని నమ్మించి గొంతు కోశాడు జగన్ రెడ్డి. ఈ ఐదేళ్లలో కడప జిల్లాకు ఒక పరిశ్రమ వచ్చిందా? మన కులం, మన మతం అని మోసపోవద్దు. టీడీపీకి పట్టం కట్టండి. సీమ గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి లేదు. నేనూ రాయలసీమ బిడ్డనే. సీమను రతనాలసీమగా చేసే బాధ్యత నాది. మీరుణం తీర్చుకంటా. రైతులకు 90 శాతం సబ్సిడీతో బిందు సేద్యం ఇచ్చాం.

10 లక్షల ఎకరాలకు కనెక్షన్లు ఇచ్చాం. రూ.4 వేల కోట్లతో వ్యవసాయ పరికరాలు అందించాం. రాయలసీమ బాగుపడాలంటే క్విట్ జగన్ రెడ్డి –సేవ్ రాయలసీమ . రాష్ట్రంలో గంజాయి ప్రమాదకరంగా మారింది. గంజాయి కూడా అమ్ముకుంటున్నారు. పిల్లలు గంజాయికి బానిసలు అవుతున్నారు. జీవితాలు నాశనమైపోతున్నాయి. విజయవాడలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తి సెలూన్ పెట్టుకుని బతుకున్నాడు. భార్య ఉద్యోగం చేస్తోంది. వాళ్ల కొడుక్కి గంజాయి అలవాటు కావడంతో తల్లిదండ్రలు భయపడ్డారు.

హాస్టల్ లో పెట్టినా ఉపయోగం లేదు. దొంగతనాలు కూడా మొదలెట్టాడు. కౌన్సిలింగ్ ఇచ్చినా ఉపయోగం లేదు. చేతికొచ్చిన బిడ్డ గంజాయితో నాశనం అయిపోయాడు. రేపు మీ పిల్లలకూ ఇదే జరిగితే పరిస్థితి ఏంటో ఆలోచించారా? నాశిరకం బ్రాండ్లతో మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు. మహిళల మాంగల్యాలు తెంచుతున్నాడు. మీలో చైతన్యం రాకముందే జలగలా మీ రక్తం తాగుతాడు. ఏనాడైనా గంజాయిపై సమీక్ష చేశావా? నేను ముఖ్యమంత్రి అయిన వంద రోజుల్లో గంజాయిని అరికడతా…గంజాయి అమ్మేవాడు ఈ భూమ్మీద ఉండటానికి వీల్లేదు. 25 వేల కేజీల డ్రగ్స్ విశాఖ వచ్చాయి. చేతకాని దద్దమ్మలు నాపై విమర్శలు చేస్తున్నారు. నేను సీఎం ఉంటే మక్కిలు విరగ్గొట్టేవాణ్ణి. అమ్మినవాణ్ణి, తెచ్చినవాణ్ణి బొక్కలో పడేసవాణ్ణి. జగన్ రెడ్డి వల్ల తెలుగుజాతి విచ్చిన్నం అవుతోంది.

బాబాయిని చంపినోణ్ణి ఎంపీగా నిలబెట్టి ఓట్లు అడుగుతావా.?
ముండుటెండలో వచ్చిన మీలో బాధ, ఉక్రోషం కనిపిస్తోంది. జగన్ రెడ్డి ఎడమ చేత్తో రూ. 10 ఇచ్చి రూ. 100 లాగుతున్నాడు. సాక్షిలో ఫుల్ పబ్లిసిటీ ఇచ్చుకుంటాడు. కరెంటు బిల్లులు పెంచి పేదలపై బాదుతున్నాడు. ఒక్క కరెంటు విషయంలోనే ఒక్కో కుటుంబంపై రూ. 30 వేల భారం పడుతోంది. నేను ఏపీకి సోలార్ తెచ్చాను. దాన్నీ నాశనం చేశాడు దుర్మార్గుడు. ప్రజలపై రూ 60 వేల కోట్ల భారం వేశాడు. ప్రొద్దుటూరులో ఇసుక దొరుకుతోందా? 40 లక్షలమంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశాడు. భారతి సిమెంట్ రేట్లు పెంచుకున్నాడు.

పేదలకు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితి. మంచి చేసి ఉంటేనే ఓటేయమని జగన్ రెడ్డి చెప్పాడు. అతని వల్ల నష్టం జరిగిందని భావిస్తే టీడీపీకి ఓటేయండి. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. రాష్ట్రాన్ని రాతియుగం వైపు కాదు…స్వర్ణయుగం వైపు తీసుకెళతా. హు కిల్డ్ బాబాయ్ ? నీ బాబాయ్ హత్య నిందితుడినే ఎంపీ అభ్యర్థిగా పెడతావా? సిగ్గుందా నీకు? నిందితుడిని రక్షించుకోడానికి బాధితులపైనే కేసులు పెట్టాడు. వివేకా కూతురిపైనే కేసులు పెట్టాడు. నా తండ్రిని చంపిన వారినే రక్షిస్తావా అంటూ వైఎస్ సునీత అంటోంది. నిందితులను పక్కన పెట్టుకుని కలియుగం అని మాట్లాడతావా?

జగన్ రెడ్డి సీబీఐ కి సహకరిస్తే అతని పేరూ బయటకు వస్తుందని వైఎస్ సునీత చెప్పింది. తప్పులు చేసి మనుషులను చంపేసి ఊరూరా తిరుగుతూ దొంగే దొంగ అంటే ఎలా? హత్యలు చేసే వ్యక్తికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు. జగన్ రెడ్డి గుట్టు అవినాష్ రెడ్డి చేతిలో ఉంది. తోక …కుక్కను ఆడిస్తోంది. ఇలాంటి వాడు మీకు న్యాయం చేస్తాడా? జాబు రావాలంటే బాబు రావాల్సిందేగా. నేను ఒక బ్రాండ్ . అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా. జగన్ రెడ్డి పుట్టకముందు నుంచే నేను రాజకీయాలు చేస్తున్నా. నీ కలలో మీ నాన్నతో మాట్లాడు. హైదరాబాద్ అభివృద్ధికి నేను ఫౌండేషన్స్ వేశాను.

హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు కు శ్రీకారం చుట్టాను. మెట్రో తెచ్చి 165 కిలోమీటర్లకు రూపకల్పన చేసిన రూపశిల్పిని నేను. హైదరాబాద్ ఎయిర్ పోర్టు కోసం 5 వేల ఎకరాలు తీసుకుని నిర్మించాం. నాది విజన్ జగన్ రెడ్డిది పాయిజన్. ఆడబిడ్డల కోసం పనిచేసిన పార్టీ ఒక్క టీడీపీనే. మహాశక్తి కార్యక్రమం కింద నా ఇంటి ఆడపడుచులను ఆదుకుంటా. సంపద సృష్టించి పేదలకు పంచడం నాకు తెలుసు. ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, దీపం పథకం , ఉచిత బస్ ప్రయాణం వంటి పథకాలు విజయవంతంగా అమలు చేస్తాను. రూ. రైతును రాజుని చేస్తా. రూ. 20 వేలు రైతుకు ఇస్తా. కోల్డ్ స్టోరేజీలు పెట్టి , సబ్సిడీలు ఇస్తాను.

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు
జాబు రావాలంటే బాబు రావాలి-గంజాయి తాగాలంటే జగన్ రెడ్డి రావాలి. వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. మెగా డీఎస్సీ నిర్వహిస్తాను. ముఖ్యమంత్రిగా నేను 8 సార్లు, ఎన్టీఆర్ 3 సార్లు డీఎస్సీ పెట్టాం. ఐదేళ్లలో జగన్ రెడ్డి డీఎస్సీ పెట్టాడా …గుండు సున్నా. అన్నా క్యాంటీన్లు తీసేసి పేదవాళ్ల పక్షం అని ఎలా అంటావ్ జగన్ రెడ్డీ? ఇంటి నుంచే కూర్చిన పనిచేసేలా వర్క్ ఫ్రమ్ హోమ్ తెస్తాను. ప్రొద్దుటూరులో ఒక ఐటీ పార్క్ తెస్తాను. అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేస్తాను. ఏపీని ప్రపంచానికి అనుసంధానం చేస్తాను.

ఇంటింటికీ మంచినీళ్లిస్తా. బీసీలకు 50 ఏళ్లకే పించను ఇస్తాను. పెన్షన్ రూ. 4 వేలు చేస్తాం. 3వ తేదీకి రూ. 4 వేలు ఇంటికే పంపిస్తా. 3 నెలలూ పెన్షన్ తీసుకోకపోతే రూ. 12 వేలూ ఒకేసారి ఇస్తాం. మైనారిటీలు ఎవరూ జగన్ రెడ్డి మాటలు నమ్మొద్దు . అవినాష్ రెడ్డిని కాపాడుకునేందుకు ముస్లింల హక్కులను కాలరాశాడు. ఎన్డీఏ ఉన్నప్పటికీ 4 శాతం రిజర్వేషన్లు కాపాడాను. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత ఉందా జగన్ రెడ్డికి? మాదిగలకు ఏబీసీడీ క్యాటగిరి ఇచ్చేందుకు ఎన్డీఏ ముందుకొచ్చింది. సమాజంలో జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం చేస్తాం.

రాచమల్లు…పొద్దుటూరుకు రాచముల్లు
స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు…ప్రొద్దుటూరుకు రాచముల్లు. మొత్తం దోచేశాడు. బియ్యం, మద్యం, మాఫియా, డీజిల్ అన్నింటిలో వాటా ఉందా లేదా? సెటిల్ మెంట్లు చేస్తాడు. సంఘ విద్రోహక శక్తులను తరిమికొట్టాలి. సీఎం రిలీఫ్ ఫండ్ రూ. 131 కోట్లు బొక్కేశాడు. అన్నింటికీ ఫిక్స్ డ్ రేట్లు. టెక్నాలజీ దుర్మారుడి చేతిలో ఉంటే మీ బతుకులు ఆగమే. రాచమల్లు ఆస్తి రూ. 2 వేల కోట్ల పై మాటే. మరి జగన్ రెడ్డి ఆస్తి లక్షల కోట్లేగా. పోస్టింగ్ ఏదైనా చదివించుకోవాల్సిందే. అక్రమ సంపాదనలో ఆరితేరిపోయాడు.

ఎర్రచందనం వ్యాపారం చేస్తాడు. బీసీ నేత నందం సుబ్బయ్యను దారుణంగా చంపారు. నేను ఆ కుటుంబాన్ని ఆదుకున్నాను. రూ. 20 లక్షలిచ్చాను. బాబాయ్ ని చంపావ్. సుబ్బయ్యను చంపావ్. ఒంటిమిట్టలో చేనేత కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నావ్. నీ దుర్మార్గాలకు ఇంకెందరు బలికావాలి జగన్ రెడ్డీ? దుర్మార్గుడి నుంచి మీ ఆస్తులను రక్షిస్తా. ఈసారి వరదరాజులు రెడ్డిని గెలిపించండి. ప్రొద్దుటూరు దశ మారిపోతుంది. సైకోని తరిమికొట్టండి. టీడీపీ, బీజీపీ, జనసేన కూటమికి పట్టం కట్టండి.’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.

LEAVE A RESPONSE