Suryaa.co.in

Andhra Pradesh

రఘురామరాజు నామినేషన్‌కు పోటెత్తిన జనం

రఘురామకు ఉండి నీరాజనం

ఉండి టీడీపీ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన రఘురామకృష్ణంరాజుకు ఉండి ప్రజలు నీరాజనం పలికారు. ఆయన నివాసం నుంచి మొదలైన ర్యాలీని ఉండి ప్రజలు వేలాదిగా అనుసరించారు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు నుంచి భారీ స్థాయిలో ప్రజలు హాజరయ్యారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు మాట్లాడుతూ.. రఘురామకృష్ణంరాజు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించబోతున్నారని జోస్యం చెప్పారు. రఘురామకృష్ణంరాజు విజయం కోసం తామంతా సమిష్టి కృషితో పనిచేస్తామన్నారు. రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ పార్టీ ఆదేశం ప్రకారం ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించాలని కోరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు రాజు సహకారంతో తాను విజయం సాధిస్తానని చెప్పారు. ఇది ఒక రాక్షసుడిపై సామాన్యులు చేస్తున్న యుద్ధం. ఇందులో సామాన్యులంతా ఒకవైపు రాక్షసులంతా ఒకవైపు ఉన్నారు. రాక్షసులు కావాలా? రాముడు కావాలా అని ప్రజలు ఇప్పటికే తేల్చుకుని తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

LEAVE A RESPONSE