– సోమశిల జలాశయానికి రోజూ టీఎంసీ కృష్ణా జలాలు
– నదుల అనుసంధానమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు
– కరువుతో పాటు కరోనా రాలేదనే బాధలో జగనన్న
పొదలకూరు: పొదలకూరులో శ్రీ గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గంగమ్మ తల్లి దయతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి నదులన్నీ జలకళ సంతరించుకున్నాయి.
శ్రీశైలం డ్యామ్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అన్నీ నిండిపోయాయి. గోదావరి ప్రాజెక్టులు కూడా జలకళ సంతరించుకున్నాయి. సోమశిల జలాశయానికి కూడా రోజూ ఒక టీఎంసీ నీరు చేరుతోంది. రిజర్వాయర్ల నిండా నీరు చేరడంతో జగనన్న గుండె బాధతో నిండిపోయింది. మొన్నటి దాకా చంద్రబాబు నాయుడు, కరువు కవల పిల్లలని మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు ఆయన కోరిక తీరలేదు. కరువుతో పాటు కరోనా కూడా రాకపోవడంతో తెగ బాధపడిపోతున్నాడు.
రోజూ 2 లక్షలకు క్యూసెక్కులపైగా నీరు సముద్రంలో కలిసిపోవడాన్ని నిన్న నేను పొలిట్ బ్యూరో సమావేశంలో ప్రస్తావించాను. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సోమశిలకు 7 వేలు, 8 వేలు క్యూసెక్కులకు మించి రావడం లేదు. నిన్న ఆ విషయాన్ని కూడా లేవెనెత్తాను.
ఈ రోజు ప్రవాహం 11 వేల క్యూసెక్కులు దాటింది. గోదావరి, కృష్ణా నదుల ద్వారా నిత్యం 20 టీఎంసీలకు పైగా నీళ్లు వథగా సముద్రానికి పోతుంటే రాయలసీమలో మాత్రం నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో పంటలు బాగా పండి రైతులు, రైతు కుటుంబాలన్నీ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.