Suryaa.co.in

International National

భారత్‌కు రానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్

– భారత్-పాక్ ఉద్రిక్తత వేళ కీలక మలుపు
– పుతిన్‌కు మోదీ ఆహ్వానం

ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ ఏడాది భారత్‌లో జరిగే భారత్‌-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన భారత పర్యటనకు అంగీకరించారు.

ఈ ఏడాది చివరలో భారత్‌లో భారత్‌-రష్యా శిఖరాగ్ర సమావేశం జరుగనున్నది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం తర్వాత పుతిన్‌ తొలి భారతదేశ పర్యటన అవుతుంది.

ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం పుతిన్‌ ఫోన్‌ చేశారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా దాడిలో మృతి చెందిన పర్యాటకులకు సంతాపం ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు అండగా నిలుస్తామని ప్రకటించారు. ఈ దారుణమైన ఘటనకు పాల్పడిన వారిని, వారి వెనుక ఉన్న మద్దతుదారులను చట్టం ముందు నిలబెట్టాలని పుతిన్‌ సూచించారు.

ఈ సందర్భంగా భారత్-రష్యాల మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇద్దరు నేతలు అంగీకరించినట్లుగా విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాని న మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు విక్టరీ డే శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A RESPONSE