Suryaa.co.in

Andhra Pradesh

సింహాచలం ఘటనలో ఏడుగురి సస్పెన్షన్

– ఇన్చార్జి ఈఓ సుబ్బారావుపైనా వేటు
– బ్లాక్‌లిస్ట్‌లో కాంట్రాక్టర్
నివేదిక ఇచ్చిన వెంటనే సర్కారు చర్యల కొరడా

అమరావతి : సింహాచలం దేవస్థానంలో దుర్ఘటనకు బాధ్యులైన ఏడుగురిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. దేవాదాయ శాఖతోపాటు పర్యాటక శాఖలలోని వారిపై సస్పెన్షన్ వేటు వేసింది.

సింహాచలం దేవస్థానం ఈవో కె.సుబ్బారావు, సింహాచలం దేవస్థానం ఈఈ డి జి శ్రీనివాసరాజు, ఏపీటీడీసీ ఈఈ కె రమణ, దేవస్థానం డిప్యూటీ ఈఈ కె ఎస్ ఎన్ మూర్తి, ఏపీటీడీసీ డిప్యూటీ ఈఈ ఏ బీ వీ ఎల్ ఆర్ స్వామి, ఏపీటీడీసీ ఏఈ పి మదన్ మోహన్, దేవస్థానం జేఈ కె బాబ్జీపై సస్పెన్షన్ వేటు వేసింది. కాంట్రాక్టర్ కె లక్ష్మీనారాయణపై క్రిమినల్ చర్యల తీసుకోవాలని ఆదేశించింది.

సింహాచలం దేవస్థానంలో దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం కమిషన్ నివేదిక అందజేసింది. కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కమిషన్ నిర్దారించింది. తీవ్ర నిర్లక్ష్యంతో భక్తుల ప్రాణాలు కోల్పోవడానికి కాంట్రాక్టర్, అధికారులు కారణమయ్యారని ఆ నివేదికలో స్పష్టం చేసింది. ఈ కమిషన్ సిఫార్సు ఆధారంగా చర్యల తీసుకోవాలని ప్రభుత్వ నిర్ణయించింది. కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లి‌స్టులో పెట్టాలని నిర్ణయించింది. కాంట్రాక్టర్ సహా ఇద్దరు అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

సోమవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రికి కమిషన్ నివేదిక అందజేసింది. ఈ త్రిసభ్య కమిటీలో సభ్యులుగా ఐఎఎస్, ఐపిఎస్, ఇంజినీరింగ్ అధికారులున్నారు. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ అధికారుల సస్పెన్షన్‌కు ప్రభుత్వం ఆదేశించింది.

ప్రభుత్వానికి త్రిసభ్య కమిషన్ సోమవారం నివేదిక అందించింది. ఆ కొద్దిసేపటికే కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

LEAVE A RESPONSE