విజయవాడ : లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు మే 6వ తేదీ వరకు రిమాండ్ విధించింది. సిట్ అధికారులు అతడిని విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించి జరిగిన కుట్రలో శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు ఆరోపిస్తున్నారు.
కేసులో ఆరో నిందితుడిగా ఉన్న శ్రీధర్రెడ్డిని సిట్ అధికారులు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విజయవాడకు తరలించి, నేడు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి, శ్రీధర్రెడ్డికి మే 6 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.