-డ్రైవరుకు తీవ్రగాయాలు
-పరాజయం తప్పదనే అరాచకాలు: లోకేష్
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం విట్టలం సమీపంలో టీడీపీ ప్రచార రథంపై పెట్రోలు పోసి వైసీపీ మూకలు నిప్పు పెట్టారు. దీంతో వాహనం పూర్తిగా దహనమైంది. వాహ నంలో డ్రైవర్ ఉండగానే దుండగులు నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండ గులు ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ ప్రమాదంలో డ్రైవరుకు తీవ్రగాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తెదేపా నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. స్థానిక సీఐ పులిశేఖర్ వారికి సర్దిచెప్పి నిందితులను పట్టుకుం టామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
వైకాపా దుర్మార్గాలకు పరాకాష్ట: లోకేష్
దారుణ పరాజయం తప్పదనే భయంతో తప్పు మీద తప్పు చేస్తున్నావు జగన్. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద టీడీపీ ప్రచార వాహనానికి నిప్పు పెట్టడం వైకాపా దుర్మార్గాలకు పరాకాష్ట. డ్రైవర్ ఉండగానే పెట్రోల్ పోసి నిప్పంటించిన మీ రాక్షసత్వం సభ్యసమాజానికే సిగ్గుచేటు. అధికారం కోల్పోయే ముందైనా పశ్చాత్తాపం లేదా? జగన్ నువ్వు చేసిన ప్రతి నేరం, ప్రతి ఘోరానికి చట్టం ముందు దోషిగా నిలబడక తప్పదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు.