Suryaa.co.in

Andhra Pradesh

రామోజీరావు మృతిపట్ల టీడీ జనార్థన్ దిగ్భ్రాంతి

పత్రిక, టీవీ, సినిమా రంగాల్లో తనదైన ముద్రవేసి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపచేసిన చెరుకూరి రామోజీరావు మృతి పట్ల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్థన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాన్య కుటుంబంలో జన్మించి క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగిన రామోజీరావు జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని కొనియాడారు. ఈనాడు గ్రూపు సంస్థల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించారన్నారు. ఈనాడు పత్రిక స్థాపన ద్వారా మీడియా రంగంలో నూతన్య అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. రామోజీరావు మృతి తెలుగువారికి తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE