– తెలంగాణ సర్కారు ప్రకృతి విధ్వంసం
– వన్యప్రాణులకు ప్రాణహాని
– హర్యానా సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు
అడవులపై బుల్డోజర్లు పంపడంలో తెలంగాణ ప్రభుత్వం నిమగ్నమై ఉంది ప్రకృతి విధ్వంసం, వన్యప్రాణులకు హాని కలిగించడం కాంగ్రెస్ పాలనలో సాధారణ విషయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అటవీ సంపదను నాశనం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిందని దుయ్యబట్టారు. హర్యానాలో నిర్వహించిన సభలో మోదీ హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై స్పందించారు.
హర్యానాలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ యూనిట్కు మోదీ శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు మోసపోతున్నారని అన్నారు. హిమాచల్ ప్రదేశ్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు.