Suryaa.co.in

Telangana

తెలుగువాళ్లు ఎక్కడ.. ఏ ప్రాంతంలో ఉన్నా మనవారే

– వెంకయ్య నాయుడు రాష్ట్రపతి స్థాయికి ఎదగాలి

– శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహీతలకు ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించడం ఒక బాధ్యతగా భావించాం. ఇది రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం. తెలుగువాళ్లు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా మనవారే. ఒక మంచి సంప్రదాయానికి పునాది వేసేందుకే ఈ కార్యక్రమం. ఈ సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలి. అవార్డు గ్రహీతలు ప్రభుత్వాన్ని అభినందించడమంటే.. మన ప్రజా పాలనను అభినందించినట్లే.

పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షల నగదు బహుమతి ప్రభుత్వం తరపున అందిస్తాం. దీంతోపాటు ప్రతీ నెల పద్మశ్రీ అవార్డు పొందిన కవులు, కళాకారులకు రూ.25వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించాం. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు మనమంతా ఏకమై ముందుకు సాగాలి… ఒక తెలుగువాడిగా వెంకయ్య నాయుడు రాష్ట్రపతి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా…

 

LEAVE A RESPONSE