చంద్రుని రథం

సూర్యునికి ఉన్నట్లే, చంద్రునికి కూడ గొప్ప ప్రకాశమానమైన ప్రామాణికమయిన రథం ఉంది. మూడు చక్రాలతో – ఉదకగర్భం నూంచి పుట్టిన మల్లెమొగ్గల్లా తెల్లని గుర్రాలను పూంచినరథం చంద్రునిది. ఈ రథంనకు ఇవి రెండువైపులా చెరో ఐదు ఉన్నాయి. ధ్రువుడీ చంద్రరథాన్ని కూడా అదుపుచేస్తూ, మండలాకారంలో నక్షత్రవీధిలో సంచరింప జేస్తున్నాడు. ఇవి ఇట్లే కల్పాంతం వరకు ఉంటాయి.
సూర్యకిరణాల లాగానే, చంద్రకిరణాలకూ తరుగుదల – పెరుగుదల లున్నాయి. దేవతలచేత పానం చేయబడి క్షీణదశ పొందిన చంద్రబింబాన్ని దీప్తిమంతుడై రవి తృప్తిపరుస్తాడు. అమావాస్య రోజున 15వ చంద్రకళ పితృదేవతల చేత పానము చేయబడుతుంది.

కృష్ణపక్షంలో ఏ తిథిలో ఎంత త్రాగబడిందో, అంతపుష్ఠి శుక్లపక్షంలో భాస్కరుడు అందజేస్తాడు.పదిహేను రోజులపాటు ఊండే శుక్లపక్షంలో రోజురోజుకూ చండ్రుడు, సూర్యునినూంచి కాంతిని (పుష్ఠిని) పొందగా, అలా ప్రోగుపడినట్టి ‘సుధా’ రసమును (చంద్రబింబంలోని అమృతాన్ని) దేవతలు పానం చేస్తూ వుంటారు. అందువల్లనే అమరులు సుధాహారులు. (సుధకు వెన్నెలలోని అమృతం అని పేరు)

ఈ ప్రకారం 33,333 మంది దేవతలు, చంద్రునిలోని అమృతాన్ని పానం చేస్తారు. అప్పుడు కేవలం రెండుకళలచేత మాత్రం మిగిలి, సూర్యమండలాన ప్రవేశించి ‘అమా’ అనే కిరణంలో వసించుట చేత కృష్ణపక్షపు 15వ తిథి ‘అమావాస్య’ అనే పేరు వచ్చింది.ఆరోజున చంద్రుడు అహోరాత్రాలు నీటిలో వసిస్తాడు. తరువాత తరువులు – లతల లోనికి ప్రవేశిస్తాడు. (చెట్లు – ఔషధమొక్కలలోనికి కూడ) తదుపరి సూర్యునిలోనికి ప్రవేశిస్తాడు.

కనుక అమావాస్య తిథియందు చెట్ల ఆకులను త్రుంచకుడదు. అది బ్రహ్మహత్యా పాతకంతో సమానం. ఈరోజున అపరాహ్ణసమయంలో సౌమ్యులు, బర్హషదులు, అగ్నిష్వాతులు అనే నాలుడుప్రధాన భాగాలనే ముడురకాల పితృదేవతలు చంద్రునిలో మిగిలిఉన్న కళను త్రాగేస్తారు. ఈ ప్రకారం దేవతల్ని, పితృదేవతల్ని, ఔషధులని పెంపొందించిన కారణంగా మనుజుల్ని తృప్తి చెందిస్తాడు.

చంద్రుని పుత్రుడు బుధుడు. ఇతని రథం పింగళ వర్ణంలో ఉంటుంది. వాయువేగం గల 8 గుర్రాలు కలిగినది. వాయువు – అగ్ని అనే ద్రవ్యాలతో కూడినది. భూమ్మీద జనీంచిన గుర్రాలను పూంచినట్టిది – వరూధము, కర్షము, పతాకము, ఉపాసంగము అనే నాలుగు ప్రధాన భాగాలు కలిగినట్టి రథం శుక్రునిది.

కుజునిది బంగారు రథం. ఎనిమిది పద్మరాగమణులలాగ ఎర్రని గుర్రాలతో శోభాయమానమైనది. ఈ గుర్రాలు అగ్ని ద్వారా జనించాయి. బృహస్పతి రథానికి ఎనిమిది గుర్రాలున్నాయి. అయితే ఇవి లేతబంగారు రంగుతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ రథం మీద బృహస్పతి ప్రతిరాశిలోను ఒక్కొక్క సంవత్సరం నివశిస్తాడు.

శనైశ్చరుని రథం మందగమనం కలది. ఇది శబలవర్ణ గుర్రాలున్న రథం. రాహువు రథం బూడిద వర్ణమ్లో ఉండి, తుమ్మెద రెక్కల్ని పోలిన నలుపురంగు గురాలను పూంచినట్టిది. గ్రహణసమయాలలో మాత్రం తన ఉనికి చాటుతాయి. కేతుగ్రహానిది పొగరంగు రథం. ఈతడి రధాశ్వాలు ఎర్రని రంగులో ఉంటాయి.(లక్కరంగు అని కోందరు)

ఈ తొమ్మిదీ గ్రహ రథాలు. ఇవన్నీ వాయురూపమ్లో ఉండే కట్టుత్రాళ్లతో ధ్రువుని ఆధీనంలో ఉంటాయి. ఇవేకాక నక్షత్రాల – గ్రహాల – సమస్త జ్యోతిర్మండలం పగ్గాలు ధ్రువుని అదుపులో ఉంటాయి. ఇవి ‘ప్రవహము’ అనే వాయువు చేత ప్రేరేపించబడి, తాము చలిస్తూ, గానుగను త్రిప్పేరీతిగా ధ్రువుని కూడ చలీంపజేస్తున్నాయి. ధ్రువస్థానానికి మొసలి రూపుధరించిన శ్రీమహావిష్ణువే, (శింశుమారుడు) సహాయకారిగా ఉండి ఈ చారణవిధినంతటినీ ఒక క్రమంలో జరిగేలా చూస్తాడు.

ఈ శింశుమార చక్రాన్ని ఏ మనుజుడు దర్శించగలడో, అట్టిమానవుని పాపాలన్నీ పటాపంచలవుతాయి. ఈ శింశుమార చక్రాన్ని అనుసరించి ఎన్ని తారకలుంటే, అన్ని ఏళ్లు దీన్ని దర్శించేవారు జీవిస్తారు. శింశుమార స్వరూపంలో – ధర్మౌ శిరస్సు. ఒక దౌడ ఉత్తానపాదుడు, రెండో దౌడ యజ్ఞం. హృదయంలో నారాయణుడు. అశ్వినీ దేవతలు పాదాలు, వరుణుడు, సూర్యుడు ఊరుభాగము. మిత్రుడు అపానమార్గం, సంవత్సరం శిశ్నభాగాన్ని ఆశ్రయించి ఉన్నారు. తోకను ధ్రువుడు – అగ్ని – కాశ్యపుడు – మహేంద్రుడు ఉన్నారు. ఈ నలుగురూ ఎన్నడూ అస్తమించరు. ఇంతవరకు భూమి, ద్వీపాలు, సముద్రాలు, పర్వతాలు, జ్యోతిర్గణం, అంతరిక్షాది విశేషాలు విపులంగా చర్చించబడ్డాయి. ఇప్పుడు నదీనదాల గురించీ విను!
నీరు(జలము) విష్ణుస్వరూపం్. దాని నుండి భూమి, నదీ, పర్వత సాగరాలతో కుడి – పద్మాకారంగా జన్మించినది. అంతేకాదు! జ్యోతిస్సులు, లోకాలు, గిరులు, నదులు, దిక్కులు అన్నీ విష్ణువే! జ్ఞానమూర్తి సకలస్వరూపుడు ఆయన. ఇవన్నీ జడములు. అనుక్షణ విలక్షణంగా కనిపిస్తాయి. పాంచ భౌతికమైన ఈ అచిత్‌ ను నిత్యవస్తువు గా భావింపదగదు. ఇవి స్థూలదృష్టికి శాశ్వతంగా ఉన్నట్లు కనిపీంచినా, సూక్ష్మదృష్టికి మాత్రం అశాశ్వతమైనవే అర్తం!

పరిణామశూన్యమై – నిత్యైకరూపమై భాసించే ఆత్మ ఒక్కటియే ‘సరూపము’ (అనగా సతే – చిత్‌ – ఆనందరూపం). మట్టి నానా రూపులు దాల్చినపుడు మనం వేర్వేరు పేర్లు పెట్టుకున్నప్పటికీ, జ్ఞానులకు మాత్రం అది ‘మృత్తిక’ గానే గోచరించే పదార్థం. ‘జ్ఞానం’ ఏదైతే ఉందో, అది రకరకాల మనోభావాలు గలవారిని బట్టి, పలువిధాలుగా చూపబడుతొంది. కాని, వాసుదేవుడు ఒక్కడే! ఈ భువనభాండం విస్తరించిన తీరునంతటినీ ‘లోకవ్యవహారదృష్టి’ తో నీకు తెలియజేసెను కాని, మైత్రేయా! ఇంతకుమించినది ‘సత్’ అనబడే పరబ్రహ్మమొక్కటే! భూ, భవ, సువ్ర్లోకాది హోగాలూ – వాటి ఫలాలూ – కర్మలో శ్రద్ధాళువులకు అందగలవు. కాని, అచలుడైన వాడు మోక్షమార్గసాధకుడు. అట్టివాడు సదైకరూపుడైన ఆత్మను ధ్రువుడిగా తెల్సి ఉపాసిస్తాడు గనుక, అతడు పరమపదమందగలడు.

ఇంతవరకు బ్రహ్మాండస్వరూప – స్వభావాన్ని పరాశరుడు విశదీకరించగా, మైత్రేయుడు ఇలా అన్నాడు….
“పరాశర మునీంద్రా! భరత చక్రవర్తి సాలగ్రామ క్షేత్రాన నివశించి, ఆ భరతభూమి ప్రభావం చేత యోగయుక్తుడై నిరంతరం శ్రీహరియందే మనస్సు నిల్పిఉన్నాడు కదా! జనాంతరంలో విప్రుడైననట్టి ఆ మహారాజు మళ్లీ జన్మ ఎందుకు ఎత్తవలసి వచ్చింది? కర్మబంధం నూంచి ముక్తుడై, మోక్షపదం అందుకున్నాడా? లేక సామాన్య గుణములచేతనే సంసారంలో తగులుకుని తిరిగి జన్మపరంపరలోకి లాగబడ్డాడా? అతడిగాథ ఆనతీయవలసిందిగా వేడుతున్నాను”….

పరాశరుడు, జడ భరతోపాఖ్యానాన్ని ఇలా చెప్పసాగాడు….
“మైత్రేయా! అతడు సత్యము, శౌచము, అహింస మొదలగు సకల సద్గుణాలచేత, మనోనిగ్రహంచేత శ్రీహరియందే మనస్సునిల్పి, పరమోత్కృష్టుడని పేరుపొంది చిరకాలం సాలగ్రామ క్షేత్రాన వసించాడు. అని ఆ మహారాజు నిరంతరం హరినామ స్మరణం తప్ప ఇంకొకటి ఎరుగని వాడయ్యాడు. హరిపూజకు పుష్పాలు సమకూర్చుకోవడం తప్ప ఇంకొక పని ఏదీ చేయని వాడయ్యాడు. నిర్మోహం – నిస్సంగత్వం ఒక దీక్షగా స్వీకరించిన వాడయ్యాడు. మునివృత్తి నవలంబించిన అతనికి జటాజూటము ఉండేది.

Leave a Reply