వైకాపా పాలనలో రెచ్చిపోతున్న రౌడీమూకలు

– ఆసుపత్రిలో గాంధీని పరామర్శించిన చంద్రబాబు

హైదరాబాద్: వైకాపా అధికారంలోకి వచ్చాక రౌడీమూకలు రెచ్చిపోతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైకాపా నేతల దాడిలో గాయపడిన తెదేపా ఏపీ కార్యదర్శి చెన్నుపాటి గాంధీని ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రిలో ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘చెన్నుపాటి గాంధీ కన్ను పూర్తిగాgandhi దెబ్బతింది. ఎమోషన్‌లో జరిగిందని పోలీసులు చెబుతారా? నేరస్థులకు అండగా ఉండటమా పోలీసుల బాధ్యత? గాంధీపైనే కేసులు పెట్టడానికి ప్రయత్నించారు. దోషులెవరినీ వదిలిపెట్టేది లేదు. దాడులకు భయపడే ప్రసక్తే లేదు. రౌడీయిజాన్ని నమ్ముకున్నవారు ఎవరూ బాగుపడలేదు. హత్యా రాజకీయాలకు పాల్పడితే ఊరుకునేది లేదు’’ అని చంద్రబాబు హెచ్చరించారు.

Leave a Reply