Suryaa.co.in

Telangana

మహిళా భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

-చొరవతీసుకోవాలంటూ గవర్నర్ కి వినతిపత్రం సమర్పించిన మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి

రాష్ట్రంలో అనునిత్యం ఆడబిడ్డలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీస బాధ్యత లేదని మహిళలపై జరుగుతున్న సంఘటనలను ఆపేందుకు తమ జ్యోక్యం అవసరం అని గౌరవనీయులైన తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మని రాజ్ భవన్ లొ మర్యాదపూర్వకంగా కలిసి మెమోరాండం సమర్పించిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి .

ఒక అత్యాచార సంఘటన మరువకముందే మరొక సంఘటన జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య, ఉదాసీన వైఖరి గురించి మరియు ఎన్ సి ఆర్ బి డేటా ప్రకారం 2023 లొ తెలంగాణలొ నేరల రేటు 12%కి పెరిగిందన్నారు.

రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల నుంచి ప్రయాణికుల వరకు మహిళలకు రక్షణ లేదని వారం రోజుల క్రిందట రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిఒడ్డున మలక్ పెట్ లో ఉన్న అంధుల హాస్టల్ ఉన్నటువంటి అంధ బాలికపైన స్కావెంజర్ అత్యాచారానికి పాల్పడడం జరిగింది, వనస్థలీపురం లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్పై సామూహిక అత్యాచారం, ఓ.యూ పి.ఎస్ పరిధిలో ప్రయాణీకురాలిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ అఘాయిత్యం, షాద్ నగర్ పి ఎస్ లో విచారణ అంటూ దళిత మహిళా పై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి విచక్షరహితంగా కొట్టిన తీరును, నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో దివ్యాంగ మహిళపై అత్యాచారం గత కొన్ని రోజుల వ్యవధిల్లోనే సుమారుగా 20 పైగా అత్యాచార ఘటనలు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని డాక్టర్ శిల్పారెడ్డి మెమోరాండం లో పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మహిళలలపై జరుగుతున్న అఘాయిత్యాలపట్ల రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసులు ఉదాసీనంగా వ్యవహారిస్తున్నారని చాలా సార్లు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా జ్యోక్యం చేసుకుంటే తప్ప మహిళలపై నేరలకు పాల్పడిన నిందితులపై ఎటువంటి కేసులు నమోదు కాలేదన్నారు.

అందువల్ల, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై నివేదిక సమర్పించాలని, అలాగే శాంతిభద్రతలను కఠినతరం చేసేందుకు అవసరమైన సూచనలను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించే విషయంలో జోక్యం చేసుకోవాలని బిజెపి మహిళా మోర్చా విజ్ఞప్తి చేస్తుందన్నారు.

LEAVE A RESPONSE