Suryaa.co.in

Telangana

రాజ్యాంగం మారుస్తామని కుట్రలు చేస్తున్నారు

-బీజేపీతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం
-రాష్ట్రంలో ఆ పార్టీని బొంద పెట్టండి

-నిజామాబాద్‌ కార్నర్‌ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి

నిజామాబాద్‌: రాజ్యాంగాన్ని మారుస్తామన్న బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నిజామాబాద్‌ కార్నర్‌ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని ఐదేళ్లుగా అరవింద్‌ మోసం చేశారు.. చెరుకు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించలేదు. ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుపడిన అరవింద్‌ మళ్లీ ఇవాళ వచ్చి రాజ్యాంగాన్ని మారుస్తామం టున్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామన్న వారిని గద్దె దించాలి.

2021లో మోదీ జనగణన, కులగణన చేయలేదు. రాజ్యాంగాన్ని మార్చడానికి, రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్ర చేస్తున్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేయండి. ఇష్టారాజ్యంగా రాజ్యాం గాన్ని మార్చుకుంటూ పోతే దేశంలో ప్రజస్వామ్యం బ్రతుకుతుందా? గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు దేశంలో ప్రజాస్వా మ్యానికి ప్రమాదం పొంచి ఉంది. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్లు కాపాడే బాధ్యత కాంగ్రెస్‌ తీసుకుంటుంది.. నరేంద్రమోదీ తెలం గాణకు ఇచ్చింది…బీజేపీ తెచ్చింది ఏమీ లేదు.. గాడిదగుడ్డు తప్ప. రాష్ట్రంలో బీజేపీని బొందపెట్టాలి. బీసీ జనగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచే బాధ్యత తమదని తెలిపారు.

నిజామాబాద్‌కు రింగ్‌రోడ్డు వేయిస్తా…
కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం.. రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చాం. రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సదుపాయం కల్పించాం. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షలు ఉచితంగా ఇస్తున్నాం. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కు పాదం మోపాం. వంద రోజుల్లో ఇన్ని చేసిన కాంగ్రెస్‌ను ఏం చేశారని కేసీఆర్‌ మాట్లాడుతుండు. బిడ్డ బెయిల్‌ కోసం నిజామాబాద్‌ ఆత్మగౌరవాన్ని బీజేపీ కాళ్ల దగ్గర కేసీఆర్‌ తాకట్టు పెట్టారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే. నిజామాబాద్‌ అభివృద్ధికి నేను అండగా నిలబడతా. నిజామాబాద్‌కు రింగ్‌ రోడ్డు వేయించే బాధ్యత మాది. మీరు జీవన్‌ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE