Suryaa.co.in

Andhra Pradesh

విజయవాడను నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతా

-మోదీని తీసుకువస్తా…
-కూటమి రాగానే ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశాం
-పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి
-47వ డివిజన్‌ కొండ ప్రాంతంలో ప్రచారం

విజయవాడను మోదీ సహకారంతో నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతామని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు.గురువారం 47వ డివిజన్‌ కొండ ప్రాంతంలో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అక్కడి వారు సమస్యలను మొరపెట్టుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ వన్‌టౌన్‌ అంటే అభివృద్ధిలో నెంబర్‌ వన్‌లో ఉండాలి..కానీ, ఇక్కడ పాలకుల నిర్లక్ష్యం వల్ల పూర్తిగా వెనుకబడిరది. ఎక్కడకి వెళ్లినా ప్రజలు సమస్యలను ఏకరువు పెడుతు న్నారు. కనీస మౌలిక వసతులు కూడా లేక అవస్థలు పడుతున్న తీరు ఆవేదన కలిగించింది. అభిóవృద్ధి చేశామని చెప్పుకునే వారు ఏం చేశారో వైట్‌ పేపర్‌ విడుదల చేయాలని కోరారు. అబద్ధాలు, అసత్యా లతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఓట్ల కోసం హామీ ఇచ్చి అమలు చేయని వారిని రీకాల్‌ చేసే విధానం రావాలి. అప్పుడే ప్రజాప్రతినిధులు మోసం చేయలేరు…ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.

కేంద్రం, రాష్ట్రంలో నాకున్న పరిచయాలతో ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా. రాజ్యసభ సభ్యుడిగా, సుజనా ఫౌండేషన్‌ పేరుతో ఎంతో అభివృద్ధి చేశా, సేవ చేశా. ఇప్పుడు దుర్గమ్మ ఆశీస్సులతో ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం నాకు వచ్చింది. ప్రధాని మోదీని ఈ నియోజకవర్గానికి తీసుకు వస్తా. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అభివృద్ధికి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు.

LEAVE A RESPONSE