Suryaa.co.in

Andhra Pradesh

అర్హులైన ప్రతీ గిరిజనుడికి స్వంత ఇల్లు మంజూరు చేస్తాం

– పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్

బుట్టాయిగూడెం : అర్హులైన ప్రతీ గిరిజనుడికి స్వంత ఇల్లు మంజూరు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. బుట్టాయిగూడెం మండలం పులిరాముడుగూడెంలో పిఎం జన్మజాతి ఆదివాసీ న్యాయ మహా అధ్యయన్ (జన్మహా) కేంద్ర పధకం కింద ఇంటి నిర్మాణ పనులను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.

లబ్ధిదారు బి. మాధవి ని కలిసి ఇంటి నిర్మాణ పనులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పిఎం (జన్మహా) పధకం కింద కేంద్ర ప్రభుత్వం నిరుపేదలైన గిరిజనలకు 340 గజాలలో 3. 39 లక్షల రూపాయలతో ఇళ్లను నిర్మిస్తున్నదన్నారు. బుట్టాయిగూడెం మండలానికి 410 ఇల్లు మంజూరయ్యాయని, వాటిని జూన్ నెలాఖరు నాటికి పూర్తిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

అర్హుడైన ప్రతీ గిరిజనుడికి స్వంత ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజల వద్దకు వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. త్రాగునీటి సమస్య, రోడ్లు, డ్రైనేజ్ స్, తదితర సమస్యలు ఉన్నాయని గ్రామస్తులు మంత్రికి తెలియజేయగా, త్వరలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారిని మంత్రి ఆదేశించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, పత్సమట్ల ధర్మరాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి రాములు నాయక్, పాల్గొన్నారు.

LEAVE A RESPONSE