Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి పేరు చెబితే గుర్తొచ్చేవి హత్యలు, అబద్దాలు, అరాచకాలే

-చంద్రబాబు పేరు చెబితే అభివృద్ధి, స్వయం ఉపాధి గుర్తొస్తాయి
-రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి
-అబద్దాలతో ఎల్లకాలం ప్రజల్ని మోసం చేయలేరని జగన్ గుర్తెరగాలి
-జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ రెడ్డిని మరోసారి నమ్మి ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి ధ్వజమెత్తారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పేరు చెబితే మోసాలు తప్ప ఏమీ గుర్తుకు రావని జగన్ రెడ్డి చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కావలి బహిరంగ సభలో నారా చంద్రబాబుపై దూషణలు, నిందలు, అబద్దాలు తప్ప తాను చేసిందేంటో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో జగన్ రెడ్డి ఉన్నారన్నారు. తన మోసాల్ని చంద్రబాబుకు అంటగట్టి చెప్పిన అబద్దమే వంద సార్లు చెప్పి, వంద మందితో చెబుతున్నాడు. జగన్ రెడ్డి చెప్పే అబద్దాలకు ప్రజలు ఒకసారి మోసపోయారు. మరోసారి మోసపోవడానికి ప్రజలు అమాయకులు కాదు. జగన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. దోపిడీలు, హత్యలు, అబద్దాలు, నమ్మక ద్రోహాలు, మోసాలు, కుట్రలు కలగలిపితే జగన్ రెడ్డి. తన అవలక్షణాల్ని చంద్రబాబుకు ఆపాదించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడన్నారు.

జగన్ రెడ్డి పేరు చెబితే బాబాయిపై గొడ్డలి వేటు. బాబాయి హంతకులను కాపాడటం గుర్తొస్తుంది. కానీ, చంద్రబాబు పేరు చెబితే సైబరాబాద్ గుర్తొస్తుంది. లక్షలాది మందికి కల్పించిన ఐటీ ఉద్యోగాలు గుర్తొస్తాయి. జగన్ రెడ్డి పేరు చెబితే గోదావరిలో మునిగిన పోలవరం, ఇసుక మాఫియాకు బలైపోయిన అన్నమయ్య డ్యాం గుర్తొస్తుంది. అదే చంద్రబాబు పేరు చెబితే పరుగులు పెట్టిన పోలవరం గుర్తొస్తుంది. నదుల అనుసంధానం గుర్తొస్తుంది. శరవేగంగా పూర్తైన 23 ప్రాజెక్టులు, 32 ఎకరాలకు నీరివ్వడం గుర్తొస్తుంది. చంద్రబాబు పేరు చెబితే తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు, నగరి, శోమశిల, ముచ్చుమర్రి గుర్తొస్తాయి.

చంద్రబాబు సాగునీటి ప్రాజక్టులకు రూ.68 వేల కోట్లు ఖర్చు చేస్తే.. జగన్ రెడ్డి ఖర్చు చేసింది రూ.12 వేల కోట్లు మాత్రమే. జగన్ రెడ్డి పేరు చెబితే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి మోపిన రూ.68 వేల కోల బాదుడు, మోటార్లకు మీటర్లు గుర్తొస్తాయి. చంద్రబాబు పేరు చెబితే కోతలు లేని విద్యుత్ సరఫరా గుర్తొస్తుంది. 15 వేల మెగావాట్ల విద్యుత్ సామర్ధ్యం గల ప్లాంట్లు గుర్తొస్తాయి. జగన్ రెడ్డి పేరు చెబితే.. జే బ్రాండ్స్ కల్తీ మద్యం, 30 లక్షల మంది అనారోగ్యం బారిన పడటం గుర్తొస్తుంది. 30 వేల మంది ప్రాణాలొదిలిన విధానం గుర్తొస్తుంది. చంద్రబాబు పేరు చెబితే నాణ్యమైన మద్యం, తక్కువ రేట్లకు అందించడం గుర్తొస్తుంది.

చంద్రబాబు హయాంలో ఉచిత ఇసుకతో రూ.1000 ఉన్న ట్రాక్టర్ ఇసుకను జగన్ రెడ్డి ఇసుక మాఫియా రూ.5000కు పెంచాడు. 40 వేల మంది భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్డున పడేయడం గుర్తొస్తుంది. జగన్ రెడ్డి పేరు చెబితే.. అమరరాజాపై దాడి, సోలార్ ప్లాంట్లపై దాడి, పెట్టుబడులు, పరిశ్రమల తరిమివేయడం గుర్తొస్తుంది. చంద్రబాబు పేరు చెబితే కియా, ఇసుజు, హీరో, అశోక్ లేల్యాండ్ లాంటి పెట్టుబడులు, పరిశ్రమలు గుర్తొస్తాయి. తద్వారా కల్పించిన లక్షలాది ఉద్యోగాలు గుర్తొస్తాయి. జగన రెడ్డి పేరు చెబితే విశాఖ రైల్వే జోన్ కు భూములివ్వకుండా ఉత్తరాంద్ర వాసుల చిరకాల కలను చిదిమేయడం గుర్తొస్తుంది.

రూ.40 వేల కోట్ల విలువైన భూములు కొట్టేయడం గుర్తొస్తుంది. రుషికొండకు కొట్టిన బోడిగుండు గుర్తొస్తుంది. చంద్రబాబు పేరు చెబితే హుధూద్ నుండి విశాఖను కాపాడిన విధానం గుర్తొస్తుంది. పరిశ్రమలు తెచ్చిన విధానం గుర్తొస్తుంది. ఆర్ధిక నగరంగా, ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దిన విధానం గుర్తొస్తుంది. జగన్ రెడ్డి పేరు చెబితే నవ మోసాలు, హత్యలు, రూ.10 ఇచ్చి రూ.100 కొట్టేయడం గుర్తొస్తుంది. ధరలు పన్నులు ఛార్జీలు, అప్పుల మోతతో పేద కుటుంబాలపై మోదిన రూ.8 లక్షల భారం గుర్తొస్తుంది.

చంద్రబాబు పేరు చెబితే.. సొంత కాళ్లపై నిలబెట్టిన సంక్షేమం గుర్తొస్తుంది. కార్పొరేషన్లతో కల్పించిన స్వయం ఉపాధి, ఇన్నోవా కార్ల లాంటి పథకాలు గుర్తొస్తాయి. జగన్ రెడ్డి పేరు చెబితే లూటీ కోసం చేసిన రూ.12 లక్షల కోట్ల అప్పు గుర్తొస్తుంది. చంద్రబాబు పేరు చెబితే సంపద సృష్టి గుర్తొస్తుంది. 5 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ గుర్తొస్తుంది. 5.13 లక్షల ఉద్యోగాల కల్పన గుర్తొస్తుంది.

సంక్షేమానికి రూ.2.70 లక్షల కోట్లు ఖర్చు చేశానని చెప్పిన జగన్ రెడ్డి.. రూ.12 లక్షల కోట్ల అప్పులు, ఐదేళ్లలో వచ్చిన ఆదాయం అంతా ఏమైంది. ఆ సొమ్మంతా ఎవరి జేబులోకి చేరింది.? ఎస్సీ ఎస్టీ బీసీ యువతకు ఇన్నోవా కార్లు అందించి డ్రైవర్లను ఓనర్లు చేసిన ఘనత చంద్రబాబుది. వాహన మిత్రతో రూ.10 వేలు ఇచ్చి జరిమానాలు, పెట్రోల్ డీజిల్ ధరలతో రూ.లక్ష కొట్టేస్తున్న ఘనత జగన్ రెడ్డిది. పేదల్ని నిరుపేదల్ని చేసి, వారిని ఓటు యంత్రాలుగా చూసే దుర్మార్గుడు జగన్ రెడ్డి. పేదల్ని సొంత కాళ్లపై నిలబెట్టిన పేదల పక్షపాతి చంద్రబాబు. పేదల జేబులు కొట్టేస్తున్న జగన్ రెడ్డిని మించిన పెత్తందారులెవరైనా ఉన్నారా? చంద్రబాబుపై నిందలేయడం మాని.. ఐదేళ్లలో సాధించింది ఏమైనా ఉంటే చెప్పుకో.

చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం తపిస్తున్నాడు. తెలుగు వారిని, తెలుగు జాతిని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలని ప్రయత్నిస్తుంటే.. కామకేళి అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకోవాలి. కామ కేళి డాన్సులు వేసే అంబటి లాంటి ఆంబోతులకు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదు. జగన్ రెడ్డి ముఠా మోసాలు, అబద్దాలు, హత్యా రాజకీయాలపై ప్రజలంతా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు.

ఇప్పటికే జగన్ రెడ్డి దగ్గరుండే బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులంతా తెలుగుదేశంతోనే సామాజిక న్యాయం సాధ్యమని గుర్తించి టీడీపీతో కలిసి నడుస్తున్నారు. ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండడంతో.. ఏం చేయాలో తెలియక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. మైండ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలంతా ఏకమై తరిమేందుకు సిద్ధమైపోయారు. నీ మోసపూరిత హామీలు, నీ మోసపూరిత జిమ్మిక్కుల్ని నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని జగన్ రడ్డి గుర్తుంచుకోవాలి

LEAVE A RESPONSE