Suryaa.co.in

Andhra Pradesh

యువతిపై యాసిడ్ దాడిజరిగితే పవన్ ఎందుకు స్పందించలేదు?

– స్థానిక సంస్థల్లో బలం లేకపోయినా బలవంతంగా దక్కించుకునే ప్రయత్నం
– ఎక్కడ చూసినా గంజాయే కనిపిస్తుంది
– ఆడబిడ్డపై యాసిడ్ దాడి జరిగితే హోం మంత్రి మ్యూజికల్ నైట్ లో తరిస్తున్నారు
– తూర్పు గోదావరి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

రాజమహేంద్రవరం: ప్రస్తుత ప్రభుత్వంతో రాష్ట్రంలో పౌర సమాజానికి ముప్పు పొంచి ఉంది. ఫిర్యాదు చేసిన వ్యక్తులను ముద్దాయిలుగా మారుస్తున్నారు. చంద్రబాబు రాజకీయం అంతా కుట్ర కుతంత్రాలతో నుండి ఉంటుంది. స్థానిక సంస్థల్లో బలం లేకపోయినా బలవంతంగా దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నాయకులను కొనుగోలు చేస్తున్నారు.ప్రతిపక్షాలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొనుగోలు రాజకీయాలకు చంద్రబాబే ప్రధాన నిదర్శనం. హైదరాబాదులో ఎమ్మెల్సీ ఎన్నికల కొనుగోలుకు సంబంధించి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళున్న రాత్రికి రాత్రే చంద్రబాబు వచ్చారు. తెలంగాణ నుంచి రావలసిన ఆస్తులు విలువ లక్షా పదివేల కోట్లు చంద్రబాబు వల్లే రాలేదు .

గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోతుందని అనేక ఆరోపణ చేశారు. కేవలం అధికారం కోసం విష ప్రచారం చేశారు. గడచిన తొమ్మిది నెలల్లో లక్ష 43వేల కోట్లు అప్పులు చేశారు. తాను ప్రకటించిన నవరత్నాలను అమలు చేయలేదని ఏనాడు జగనన్న చెప్పలేదు.

అధికారంలోకి వచ్చి 8నెలలు గడుస్తున్నా ఒక్క పథకం కూడా సజావుగా అమలు చేయలేకపోయారు. ఖజానాకు వస్తున్న ఆదాయం ఏం చేస్తున్నారో చంద్రబాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అధికారులకు వచ్చిన 100 రోజుల్లోనే గంజాయి నిర్మూలిస్తామన్నారు… ఇప్పుడు ఎక్కడ చూసినా గంజాయే కనిపిస్తుంది.

రాష్ట్రంలో ఆడబిడ్డపై యాసిడ్ దాడి జరిగితే హోం మంత్రి మ్యూజికల్ నైట్ లో తరిస్తున్నారు .ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే సహించనన్న పవన్ కళ్యాణ్ , యువతిపై యాసిడ్ దాడిజరిగితే ఎందుకు స్పందించలేదు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అత్యాచారం జరగని రోజు అంటూ లేదు. ఇ‌సుక అక్రమ రవాణా వల్ల వచ్చే ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళుతుంది? ఇసుక దోపిడీ జరగడానికి కారణం ప్రభుత్వమే. పర్యావరణాన్ని రక్షించాల్సిన ప్రభుత్వం దారుణంగా ఇసుక అక్రమాలకు పాల్పడుతుంది.

పోలవరం విషయంలో చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారు. పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే కనీసం ఎంపీల ద్వారా చంద్రబాబు అడ్డు కట్టు వేసే ప్రయత్నం చేయలేకపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఆస్తులు మాత్రమే పెరిగాయి. ప్రజల జీవన ప్రమాణాలు ఏమాత్రం పెరగలేదు.

LEAVE A RESPONSE