Suryaa.co.in

Telangana

ఐదు నెల్లల్లో ఎందుకిట్ల జరుగుతాంది?

-గుజరాత్ మోడల్ అంటే గోద్రా మోడల్ తెస్తారా ?
-బీజేపీ కాంగ్రెస్ చెప్పేదంతా ట్రాష్.. నమ్మొద్దు
-నేను కూడా హిందువునే
-బస్సు యాత్ర – రోడ్డు షో లో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్

నిజామాబాద్ : మోడీ నూటా యాభై నినాదాలిచ్చిండు ఒక్కటి అమలుకాలేదు. అచ్చేదిన్ రాలేదు కానీ సచ్చే దిన్ వచ్చినయి. సబ్కా సాత్ కాలేదు గానీ సబ్కా సత్య నాశ్ అయింది. ప్రధాని ఇంటికి 15 లక్షలు ఇస్తామన్నాడు వచ్చినయ.?పదిహేను లేదు పాసు లేదు. మోడీ గోదావరిని ఎత్కపోతంటే సుద్దమా యుద్దం చేద్దామా .?

పులిబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్ గెలువాలే. నేను గులాబీ జెండాను ఎత్తినప్పుడు జెడ్పీ చైర్మన్ ను గెలిపించి తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తిన జిల్లా నిజామాబాద్. నేను జీవితకాలం ఈ జిల్లాను మర్చిపోను. బీజేపీ గెలిచి చేసిందెంది? వచ్చిందేంది ఆలోచించాలే. నాటి పాలకులు నిజాం సాగర్ ను ఎండబెట్టినారు. శ్రీరాం సాగర్ ను వరదకాల్వ చేసుకున్నాం.

సాగునీరు తెచ్చుకుని రైతన్నలను కాపాడుకున్నాం వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకొన్నాం. మనం అమలుచేస్తున్న పాత పథకాలను వేటినీ ఇస్తాలేదు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. అన్నీ బందు పెట్టినారు. పరిశ్రమలు తరలి పోతున్నాయి. ఐదు నెల్లల్లో ఎందుకిట్ల జరుగుతాంది.? కేసీఆర్ రథం ఎక్కంగానే నిలదీయంగానే రైతు బంధు ఏస్తున్నడు. బిఆర్ఎస్ నిలదీస్తేనే అన్ని అమలైతాయి. మన బలం బీఆర్ఎస్ మనగలం బిఆర్ఎస్ మన శక్తి బిఆర్ఎస్. బిఆర్ఎస్ ను గెలిపిస్తేనే అన్నీ సాధిస్తాం.

రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం అని రాసిపెట్టినట్టే ఉంది కాంగ్రెస్ పాలన. ఎన్నడు అడిగినా రేపే. రెండు లక్షల రుణమాఫీ కావాలంటే బాజిరెడ్డి గెలవాలి. ఈ ముఖ్యమంత్రి ఏడికి పోతే ఆడ దేవుండ్లమీద వొట్లు పెట్టుకుంటాండు. బీడీ కార్మికులు నీతి నిజాయితీ చూయించి బీఆర్ఎస్ కు అండగా నిలువాలే. బీజేపీ కాంగ్రెస్ చెప్పేదంతా ట్రాష్.. నమ్మొద్దు.

తెలంగాణ సెక్యులర్ స్టేట్.మన ప్రభుత్వ హయాం లోముస్లింల అభివృద్ధికోసం 12 వేల కోట్లు ఖర్చు చేసినం. విద్యార్థుల చదువులకోసం ఎంతో కృషి చేసాం. అల్లా క ఘర్ మే దేర్ హోగా మగర్ అం దేర్ నహీ “ ఆలస్యమైనా తెలంగాణ సాధించుకున్నాం అభివృద్ధి చేసుకున్నాం. గుజరాత్ మోడల్ అంటే గోద్రా మోడల్ తెస్తారా ? సజీవంగా దహనం చేస్తారా.? బీజేపీ ని ఇక్కడ ఓడించాలే.

నేను కూడా హిందువునే. కానీ తెలంగాణ యావత్ ప్రజల ఆత్మబంధువు కేసీఆర్. ప్రజలను మతం పేరుతో విడదీస్తే మంచిది కాదు. మోడిని వ్యతిరేకిస్తున్నా నని నన్ను ఇబ్బందులు పెడుతున్నారు. నా బిడ్డ ను అరెస్టు చేసిండ్రు. ఇప్పడిదాకా రాష్ట్రం లో బీజేపీ ని ఓడించింది బీఆర్ఎస్ పార్టీ నే. కాంగ్రెస్ బీజేపీ రొండు ఒకటే తెల్లందాక కలుసుకొంటారు.

ప్రజాస్వామ్యం పరిణితి చెందాలే అని నేను ఎన్నికల ముందు చెప్పిన. యువత ఆలోచించాలే ..రేపటి భవిష్యత్తు మీది. మనకు అన్ని హక్కులు రావాలంటే హామీలు అమలు కావాలంటేబీఆర్ఎస్ గెలవాలే. నిజామాబాద్ లో బాజిరెడ్డి గోవర్ధన్ గెలవాలే.

LEAVE A RESPONSE