Suryaa.co.in

Devotional

గుడి గంటను మూడుసార్లు ఎందుకు కొట్టాలి?

దేవాలయానికి వెళ్ళినపుడు ఘంట మూడు సార్లే ఎందుకు కొట్టాలి. తెలుసా ?
శ్లోకము :
ఏకతాడే మరణం చైవ
ద్వితాడే వ్యాధి పీడనం !
త్రితాడే సుఖమాప్నోతి తత్ఘంటానాదలక్షణం ! !

భావం : దేవుని ముందర ఘంట ఒకసారి మాత్రమే కొట్టి ఊరుకుంటే అది మన మరణానికి సంకేతం .
రెండుసార్లు కొట్టి ఊరుకుంటే వ్యాధుల ద్వారా పీడింపబడతాము.
మూడుసార్లు ఘంటానాదం చేయడం చేత శరీరమునకు , మనస్సుకు సుఖం కలుగుతుంది.
ఈ పద్దతిని దేవాలయ ఘంటా నాద లక్షణము గా శాస్త్రం చెప్పబడింది .
( దేవాలయంలో ఘంటానాదం ద్వారా జనించే ఓంకార ధ్వని తరంగాలను మన చెవుల ద్వారా శరీరంలోకి శబ్ద తరంగాలకు అనుసంధానం చేయండి తద్వారా మానసిక ప్రశాంతతను పొందండి).

సేకరణ : హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్

LEAVE A RESPONSE