Suryaa.co.in

Andhra Pradesh

అందుబాటులో ఉండి సేవలందిస్తా

-మంగళగిరిని అభివృద్ధికి కేరాఫ్ గా మారుస్తా
-అవకాశమీయండి
-తటస్థ ప్రముఖులతో యువనేత లోకేష్ భేటీలు

మంగళగిరి: మంగళగిరిని అభివృద్ధికి కేరాఫ్ గా మార్చడమే లక్ష్యమని, రాబోయే ఎన్నికల్లో తనకు అవకాశమిస్తే అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పలువురు తటస్థ ప్రముఖులను యువనేత లోకేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

తొలుత మంగళగిరి 8వవార్డుకు చెందిన ప్రముఖుడు అందే వెంకన్న నివాసానికి వెళ్లిన యువనేతకు వారి కుటుంబసభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలక సంచాలక్ సభ్యుడిగా ఉన్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలతోపాటు పద్మశాలి సామాజికవర్గీయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంకన్నఈ సందర్భంగా యువనేత ఎదుట ప్రస్తావించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా తాను రాష్ట్రవ్యాప్తంగా చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతైన అధ్యయనం చేశానని, అధికారంలోకి వచ్చాక చేనేతల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని చెప్పారు.

ఇప్పటికే టాటా ట్రస్ట్ ద్వారా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించే పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని, ఇది విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరో 2నెలల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేతలకు ఉత్పత్తులకు జిఎస్సీ రద్దుచేయాలని నిర్ణయించామని తెలిపారు. తర్వాత నవులూరు వెళ్లి యాదవ సామాజికవర్గ ప్రముఖుడు, రైస్ మిల్లర్, ఇటుకల వ్యాపారి బత్తుల శ్రీనివాసరావును కలుసుకున్నారు. ఈ సందర్భంగా తాము నిర్వహిస్తున్న వ్యాపారాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత దృష్టికి తెచ్చారు.

గత అయిదేళ్లుగా రాష్ట్రంలో ఏ వ్యాపారవర్గం ప్రశాంతంగా తమ కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఇసుక అందుబాటులో లేకుండా చేయడంతో నిర్మాణరంగం తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. రాబోయే ప్రజాప్రభుత్వంలో ఎటువంటి వేధింపులు లేకుండా స్వేచ్చాయుత వాతావరణంలో వ్యాపారాలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో యాదవ సామాజికవర్గీయులు ఎదుర్కొంటున్న సమస్యలను శ్రీనివాసరావు ఈ సందర్భంగా ప్రస్తావించారు. బిసిలకు అన్నివిధాలా అండగా నిలిచేది తెలుగుదేశం పార్టీయేనని, రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్విదించాలని కోరారు.

చివరగా మంగళగిరి రూరల్ యర్రబాలెం వెళ్లి ముస్లిం సామాజికవర్గ ప్రముఖుడు, ఆటోమొబైల్ వ్యాపారి సయ్యద్ బాజీ షేక్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా బాజీ షేక్ మాట్లాడుతూ… అమరావతి నిర్మాణ పనులను నిలిపివేయడం వల్ల తమ గ్రామంలో ఎంతో మంది యువకులు నిరుద్యోగులుగా మారారని తెలిపారు. యర్రబాలెంలో షాదీఖానా నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిందిగా విన్నవించారు.

యువనేత లోకేష్ స్పందిస్తూ… టిడిపి హయాంలో మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేసాం, రంజాన్ తోఫా, పెళ్లి కానుక, ఇమామ్ , మౌజామ్ లకు గౌరవ వేతనం, షాదిఖానాల నిర్మాణం, రంజాన్ వస్తే మసీదుల మరమత్తులు, రంగులు వెయ్యడానికి నిధులు కేటాయించడం జరిగింది. కానీ జగన్ ప్రభుత్వం మైనార్టీలకు ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది.

వైకాపా నాయకులు దాడులు, వేధింపులు కారణంగా అబ్దుల్ సలామ్, మిస్బా, ఇబ్రహీం లాంటి ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు అని అన్నారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అమరావతి నిర్మాణ పనులను జెట్ స్పీడుతో పరుగులు తీయిస్తారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక యర్రబాలెంలో షాదీఖానా నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని యువనేత హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE