Suryaa.co.in

Andhra Pradesh

వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా

– బాబు మోహన్

వరంగల్ జిల్లా: బీజెపి పార్టీ త‌న‌కు టికెట్ ఇస్తాను అని చెప్పి ఇవ్వలే దని ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హన్మకొండ జిల్లా ములుగు రోడ్డులోని శ్రీ సాయి కన్వెన్షన్ హాల్ ఈరోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయ‌న మాట్లాడుతూ.. వరంగల్ కి ఎప్పడు వచ్చిన కరుణ పురం నా అడ్డా అని అన్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మొదటి సారిగా కరుణ పురం చర్చికి వెళ్లడం జరిగిందన్నారు. వరంగల్ కి నాకు చిన్నప్పటినుండి అనుభవం ఉందన్నారు. తాను పుట్టింది వరంగల్ జిల్లాలోనే అని తెలిపారు.

తాను వరంగల్ ఎంపీ అభ్యర్థి గా ప్రజా శాంతి పార్టీ నుంచే పోటీ చేస్తా అని అన్నారు. తాను వేరే ఏ పార్టీ నుండి పోటీ చేయనని క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారుతున్న‌ట్లు లీకులు ఇస్తూ చీప్ రాజ కీయలు చేయకండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పుట్టిన వరంగల్ లో శెభాష్ అనిపించుకునేలాగా ప్రజలకు సేవ చెస్తా అన్నారు.

వరంగల్ ప్రజలు త‌న‌న్ను గెలిపించాలని, మంచి చేయాలనీ ఉద్దెశంతో పోటీ చేస్తున్న అన్నారు. కేసీఆర్ లాగా కే.ఎల్. పాల్ కూడా అబద్ధాలు చెప్పరని అన్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం తాను గెలిచాక ఇప్పిస్తా అన్నారు. పేద వారికి అందరికీ ఉచిత పింఛన్లు అందిస్తాన‌న్నారు.

 

LEAVE A RESPONSE