Suryaa.co.in

Telangana

పాలమూరు బిడ్డలను ఎప్పటికీ మరువం

– మహబూబ్ నగర్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ మహబూబ్నగర్ జిల్లాలో అద్భుతమైన జాతీయ రహదాలను నిర్మించింది అలాగే రైల్వేను కూడా అభివృద్ధి చేస్తుంది.విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్లు . ప్రతి పేద వాడి ఇంట్లో టాయిలెట్, వంటగ్యాస్, బియ్యం తో పాటు పేదవాడి ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ పేరుతో బీమా పథకాన్ని తీసుకొచ్చి ఏడాదికి ఐదు లక్షలు ఇస్తూ పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నారు మోడీ

పాలమూరుకు భారతీయ జనతా పార్టీకి విడదీయరని అనుబంధం ఉంది. గతంలో ఇక్కడ చేసిన పోరు యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీని బీర్ ఎస్ ను టిడిపిని ఓడించి ప్రజలు బిజెపిని గెలిపించడం జరిగింది. పాలమూరు బిడ్డలను ఎప్పటికీ మరువం తెలంగాణ పోరు యాత్ర తర్వాత తిరిగి మరోసారి కృష్ణ గ్రామం నుండి కృష్ణమ్మ ఆశీస్సులతో మళ్లీ ఈ యాత్ర ప్రారంభించడం జరుగుతుంది.

దేశంలో ఉగ్రవాదులు మత కల్లోలాలు లేకుండా మోడీ ప్రభుత్వం చేసింది. పాకిస్తాన్ ఐఏఎస్ ఉగ్రవాదుల తోకలు కత్తిరించారు మోడీ. బాబర్ అనే మూర్ఖుడు ధ్వంసం చేస్తే 500 ఏళ్లుగా గుడిసెలో ఉన్నాడు రాముడు. మోడీ భవ్యమైన అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి రాములవారిని ప్రతిష్టించారు.

LEAVE A RESPONSE