Suryaa.co.in

Andhra Pradesh

మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి

– కేంద్ర ఐటీ మంత్రి అశ్విన్ శ్రీవైష్ణవ్ కు ఎంపీ రామ్మోహన్ నాయుడు లేఖ
– డీట్ ఫేక్ సాంకేతికతతో జరిగే దుష్పరిణామాలపై దృష్టి సారించాలని వినతి

శ్రీకాకుళం: ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికతలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ఆహ్వానించాల్సి ఉందని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. అయితే.. అది సవ్యమైన రీతిలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైనే ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నూతన సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డీప్ ఫేక్ టెక్నాలజీపై ఆయన స్పందిస్తూ కేంద్ర సాంకేతిక శాఖామంత్రి అశ్విన్ శ్రీవైష్ణవ్ కు మంగళవారం లేఖ రాశారు.

ఇందులో… ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన ఉదంతాన్ని ప్రస్తావించారు. డీప్ ఫేక్ టెక్నాలజీతో మానవ ప్రమేయం లేకుండానే అసాంఘిక కార్యకలాపాలకు తెరదీయవచ్చని పేర్కొన్నారు. సినీ నటి ఘటనే దేశంలో సామాన్య యువతికి ఎదురైతే.. ఆమె భవిష్యత్, కుటుంబం పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. విపరీత సౌలభ్యం అనేది అటు మన ఇంటి ఆడబిడ్డల ఆత్మగౌరవంతో పాటు దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఎత్తి చూపారు.

సాంకేతికత పెరుగుతున్న సాంకేతికత అనేది ఉత్పాదనలో అదనపు బలంగా ఉండాలి మినహా.. మానవ సంబంధాలకు ప్రమాదం కలిగించే విధంగా ఉండకూడదని స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని, దేశంలో డీపీ ఫేక్ సాంకేతికత ఇష్టానురీతి వినియోగం, నియంత్రణపై నిపుణులైన వారితో పున: పరిశీలించాలని కోరారు.

LEAVE A RESPONSE