Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ నేతలు సిగ్గు, శరం వదిలేశారు

ర్యాలీకి వచ్చిన జన ప్రభంజనం చూసి వైసీపీ నేతలు వణికిపోతున్నారు
ఈ భూమ్మీద తానే అపర మేధావినన్నట్టు సజ్జల తీరు
ప్రజాబలం ఉన్న నాయకుడు చంద్రబాబు
ఎన్ని అక్రమ కేసులు పెట్టినా టీడీపీ జెండా దారంలోని నూలు పోగును కూడా పీకలేరు
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ పై వైసీపీ నేతల్ని ప్రజలు చీకొడుతున్నా..ఇంకా సిగ్గులేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారు.ఈ భూమ్మీద తానే అపరమేధావిని అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి ఫీలవుతున్నారు. నిన్న బెయిల్ పై విడుదలైన చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపేందుకు వచ్చిన జనసందోహాన్ని చూసి సీఎం జగన్ సహా వైసీపీ నేతలు వణికిపోతున్నారు. కోర్టు నిభంధనలున్నా చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు వేలాది మంది జనం వచ్చారు. అందుకే రాజమండ్రి నుంచి విజయవాడ రావటానికి 16 గంటలు పట్టింది.

అదే కోర్టు నిభంధనలు లేకుంటే అంతకు నాలుగు రెట్లు జనం వచ్చేవారు, రాజమండ్రి నుంచి విజయవాడ రావటానికి ఇక ఎన్నిరోజులు పట్టేదో? కోర్టు నిభంధనలు ఉల్లంఘించకుండా చంద్రబాబు నాయుడు కారులోనే ఉండి ప్రజలు, కార్యకర్తలకు చిరునవ్వుతో అభివాదం చేశారు. చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ప్రజలు ర్యాలీ చేస్తే వైసీపీ నేతలకు ఇబ్బందేంటి?

చంద్రబాబు నాయుడుని, లోకేశ్ ని చూస్తే వైసీపీ నేతలు ఎందుకంత వణికిపోతున్నారు? లోకేశ్ డిల్లీ వెళ్తే వైసీపీ నేతలు గల్లీల్లో పెడబొబ్బలు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు బెయిల్ పై బయటకొస్తే వైసీపీ నేతలు ఎందుకు వణికిపోతున్నారు. చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి 52 రోజులు జైల్లో నిర్బందించారు, బెయిల్ రాకుండా అనేక కుట్రలు చేశారు.

స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి ఇన్ని రోజులైనా ఒక్క ఆధారం సేకరించపోయారు. ఇప్పుడు మద్యంలో అక్రమాలంటూ చంద్రబాబు నాయుడుపై మరో అక్రమ కేసు పెట్టారు. ప్రజా బలం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు, ఎన్ని కేసులు పెట్టినా టీడీపీ జెండా దారంలోని నూలుపోగును కూడా పీకలేరు. మరో 5 నెలల తర్వాత వైసీపీ నేతల్ని ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొట్టడం ఖాయం.

LEAVE A RESPONSE