Suryaa.co.in

Andhra Pradesh

అధికారంలోకి రావడానికి తాడేపల్లి ప్యాలెస్ పిల్లి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు

– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య

నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ నందు బుధవారం నాడు మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య గారి కార్యాలయం నందు క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలు మరియు పోలింగ్ బూత్ ఏజెంట్లు పట్టణ తెదేపా కౌన్సిలర్లు మరియు తెదేపా నేతలతో సమావేశం నిర్వహించిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య
ముసాయిదా ఓటర్ లిస్టును పోలింగ్ బూత్ ఏజెంట్ క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. యుద్ధానికి పసుపు సైనికులు సిద్ధం కావాలి.ఒక్క ఛాన్స్ మాయతో రాష్ట్రం దివాలా తీసింది.

అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేయని నేరానికి నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులపాటు జైలులో నిర్బంధించి రాక్షసానందం పొందాడు ఈ జగన్ రెడ్డి.నారా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి నుంచి బయలుదేరి విజయవాడ వచ్చేవరకు అడుగడుగున జననీరాజనాలు, అధినేతను చూడాలని రోడ్డు పొడుగునా మహిళలు,యువత, ప్రజానీకం బారులు తీరారు.నందిగామ పట్టణ ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ మరియు సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా కత్తురోజు శ్రీనివాస చారి ని నియమించిన తంగిరాల సౌమ్య.

LEAVE A RESPONSE