Suryaa.co.in

Telangana

అన్ని రాష్ట్రాల రైతులం కలిసి కేసీఆర్ ను ప్రధానిని చేస్తాం

కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం గ్యారెంటీలు అని అబద్ధాలు చెప్తుంది
మేము నమ్మి పోస పోయాం…మీరు మోసపోకండి – కర్ణాటక రైతు నాయకులు
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టారు..కరెంట్ బిల్లులు కడుతున్నం
రైతు కోసం కేసిఆర్ లా ఆలోచించే నాయకుడు దేశంలోనే ఎవరూ లేరు
యావత్ దేశ రైతాంగానికే భరోసా కేసిఆర్
తెలంగాణ ప్రజలు కేసిఆర్ ను మూడో సారి ముఖ్యమంత్రిని చేయండి…రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల రైతులం కలిసి ప్రధానిని చేస్తాం
అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని నినదించిన ఏకైక రాజకీయ నాయకుడు కేసిఆర్
రైతు పక్షపాతి కేసిఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరం..ఆయన్ను ఇక్కడి రైతులు కాపాడుకోవాలి
రైతు బంధు,రైతు భీమా పథకాలు మా రాష్ట్రాల్లో అసలు లేనేలేవు
మా రాష్ట్రాల్లో ప్రభుత్వానికి రైతులం సాగునీటి పన్ను, వేలల్లో కరెంట్ బిల్లులు కడుతున్నం
మహారాష్ట్ర,ఉత్తర ప్రదేశ్,తమిళనాడు,కర్ణాటక,హర్యానా రైతు సంఘాల నాయకులు
కేసిఆర్ ను కాదనుకుంటే తినే పళ్ళెంలో మన్ను పోసుకున్నట్టే
కాంగ్రెస్,బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల గోసలు అనేకం
కేసిఆర్ లాంటి రైతు పక్షపాతి నాయకున్ని కాపాడుకోవటానికి వాళ్ళు ఇక్కడికి వచ్చి రైతులను చైతన్యం చేస్తున్నారు
కాంగ్రెస్ గ్యారెంటీలు అన్ని బూటకం..ఓట్ల కోసం మాత్రమే వాళ్ళ డ్రామాలు
– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని కేసిఆర్ ఫంక్షన్ హాల్లో అఖిల భారత రైతు సంఘాల నాయకులు బుధవారం సమావేశమయ్యారు. తెలంగాణ రైతు పథకాలపై వారు కూలంకషంగా చర్చించారు. కోట పాటి నర్సింహం నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సమావేశంలో రఘునాథ్ దాదా పాటిల్ – మహరాష్ట్ర -శేత్కారి సంఘటన్, రాఘవేంద్ర కుమార్ – ఉత్తర ప్రదేశ్ -క్రిషి భూమి బాచఓ మోర్చ, సేవాసింగ్ ఆర్యా – హర్యానా -బికేయు, K.M. రామ గౌందర్ – తమిళనాడు – తమిళ్ వ్యవసాయ సంఘం,పరశురాం లక్ష్మణ్ – కర్నాటక – ఫర్మార్స్ అసోసియేషన్స్ ఆఫ్ కర్నాటక,కోటపాటి నర్సింహం నాయుడు – తెలంగాణ – సౌత్ ఇండియన్ ఫార్మాస్ ఫెడరేషన్ అధ్యక్షులు,డా.మంగి రామ్ – హర్యానా, K.నాగరాజు – కర్నాటక, అన్నుమాంతరాసు – తమిళనాడు,బాల సాహెబ్ వాడ్కే – మహారాష్ట్ర తో పాటు పలువురు స్థానిక రైతులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం గ్యారెంటీలు అని అబద్ధాలు చెప్తుందనీ, కర్ణాటకలో మేము నమ్మి ఓట్లు వేసి పోస పోయామని తెలంగాణ ప్రజలు మోసపోకండనీ కర్ణాటక రైతు సంఘ నాయకుడు పరుశురాం లక్ష్మణ్ అన్నారు. వ్యవసాయానికి 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారని అది కూడా అర్థరాత్రి ఇస్తున్నారని కర్ణాటకలో ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందనీ ఆవేదన వ్యక్తంచేశారు. ఇక్కడ కేసిఆర్ 24 గంటల కరెంట్ ఇస్తూ రైతులను కంటికి రెప్పలా చూసుకుంటున్నడని వారు అభిప్రాయ పడ్డారు.

తమ పాలిత రాష్ట్రాల్లో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టారు..కరెంట్ బిల్లులు కడుతున్నమని, సాగునీటి పన్ను ఏడాదికి 12 వేలు కడతామని..కానీ ఇక్కడ కేసిఆర్ రైతులకే 10వేలు ఇస్తున్నారని కొనియాడారు శేత్కారి సంఘటన్ నాయకులు రఘునాథ్ దాదా పాటిల్. రైతు కోసం కేసిఆర్ లా ఆలోచించే నాయకుడు దేశంలోనే ఎవరూ లేరన్నారు.దేశానికి రైతాంగానికి భరోసా కేసిఆర్ అని, తెలంగాణ ప్రజలు కేసిఆర్ ను మూడో సారి ముఖ్యమంత్రిని చేయండి…రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల రైతులం కలిసి ప్రధానిని చేస్తామన్నారు.

అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని నినదించిన ఏకైక రాజకీయ నాయకుడు కేసిఆర్ అని,రైతు పక్షపాతి కేసిఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరం..ఆయన్ను ఇక్కడి రైతులు కాపాడుకోవాలనీ మహారాష్ట్ర,ఉత్తర ప్రదేశ్,తమిళనాడు,కర్ణాటక,హర్యానా రైతు సంఘాల నాయకులు ముక్త కంఠంతో పిలుపునిచ్చారు.

కేసిఆర్ ను కాదనుకుంటే తినే పళ్ళెంలో మన్ను పోసుకున్నట్టే అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇక్కడ గొప్పలకు పోతుంది. అలివి కానీ హామీలు ఇస్తున్నది కానీ వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో రైతులను అరిగోస పెడుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన మోసానికి కర్ణాటక రైతులు కరెంట్ కోసం రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్,బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల గోసలు అనేకమన్నారు. కేసిఆర్ లాంటి రైతు పక్షపాతి నాయకున్ని కాపాడుకోవటానికి వాళ్ళు ఇక్కడికి వచ్చి రైతులను చైతన్యం చేస్తున్నారనీ, కేసిఆర్ ఇక్కడ సీఎం అయితే తర్వాత దేశ వ్యాప్తంగా ఆయనకు మద్దతు కూడగడతమని రైతు ప్రభుత్వం కేసిఆర్ తోనే సాధ్యమని వారు బలంగా నమ్ముతున్నారని అన్నారు.

కేసిఆర్ ప్రధాని అయితే దేశ వ్యవసాయ ముఖ చిత్రమే మారి పోతుందని అట్లాంటి నాయకుణ్ణి గెలిపించుకోవాలని వాళ్ళకే ఎక్కువ ఆరాటం ఉందన్నారు. తమ కార్పోరేట్ మిత్రుల మేలు కోసం కాంగ్రెస్,బీజేపీ పార్టీలు కేసిఆర్ లాంటి నాయకుణ్ణి అడ్డుకొనే కుట్రలు చేస్తాయని,దాన్ని తెలంగాణ రైతాంగం తిప్పికొట్టాలని వారు మాట్లాడడంలో రైతన్నల బాగుపడాలంటే కేసిఆర్ సరైన నాయకుడని వారికి బలమైన నమ్మకముందని అన్నారు.

కాంగ్రెస్ గ్యారెంటీలు అన్ని బూటకం..ఓట్ల కోసం మాత్రమే వాళ్ళ డ్రామాలాడుతరని అన్నారు. రైతుల బాగు కోరే కేసిఆర్ లాంటి నాయకునికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. కేసిఆర్ గెలిస్తే రైతు గెలిచినట్టే అని మంత్రి వేముల అన్నారు.

LEAVE A RESPONSE