Suryaa.co.in

Andhra Pradesh

వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్య నాయకుడు దావులూరి ఆనంద్ టీడీపీలో చేరిక

కావలి పట్టణం ముసునూరుకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు దావులూరి ఆనంద్ తెలుగుదేశం పార్టీలో చేరారు.. ఆయనతో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.. కావలి టిడిపి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ 2024 మార్చి 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కావ్య క్రిష్ణారెడ్డి ని ఎమ్మెల్యే గా గెలిపించడానికి మేము అందరం కలసి కృషి చేస్తామని తెలిపారు.

LEAVE A RESPONSE